శనివారం, మే 04, 2024

వికృత మేధ!


సెక్రటరీ పరుగెత్తుకుంటూ అధినేత దగ్గరకి వచ్చి ఆయాసపడుతూ నుంచున్నాడు.

''ఏందయ్యా సెక్రట్రీ! ఆదరాబాదరా వచ్చావ్‌. నీ మొహమేంటి పెట్రమాక్స్లైటులా వెలిగిపోతోంది?''

''అదే సర్‌... కొత్త టెక్నాలజీ వచ్చిందండి. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్గురించి వినే  ఉంటారు కదండీ? కృత్రిమ మేధంటారండి. దాంతో పని చేస్తుందండి. మన సిద్ధం సభల్లో పని చేస్తుందటండి.  సంగతి తమరికి స్వయంగా చెప్పడానికి ఉరుక్కుంటూ వచ్చానండి...''

''సర్లేగానీ... ఇయ్యన్నీ ఎందుకయ్యా మనకి? అపారమైన మేధ మనకుండగా ఇక  కృత్రిమ మేధతో పనేముందయ్యా?''

''అమ్మమ్మా... అంతలా తీసిపారేయకండి మరి. మీ మేధ మీకుందిలెండి, కానీ ప్రజలకి లేదు కదండీ? వాళ్లు ఎంతసేపూ మీ పాలనలో ఏం జరిగిందనే చూసుకుంటారు. మరి మన హయాంలో ప్రగతి లేనప్పుడు ప్రచారమే కదండీ దిక్కు. ఇదందుకే ఉపయోగపడుతుందటండి...''

''బాగుందయ్యా... సరిగ్గా నా చిక్కంతా అదే. అప్పట్లో ఏదో ఊరూ వాడా తిరుగుతూ వెర్రిజనాల్ని నమ్మించడానికి నోటికొచ్చిందంతా వాగేశాం. అసలవన్నీ చేయడానికి సాధ్యమా కాదా అని కూడా ఆలోచించలేదయ్యా. ఒక్కసారి ఛాన్సిస్తే కుర్చీ ఎక్కాలనే ఉబలాటమే తప్ప ఇంకేం ఆనలేదనుకో. పాపం... వెర్రిబాగులోళ్లు అయ్యన్నీ నిజమని నమ్మేసి బంపర్ఆఫరిచ్చేశారు. రాక రాక అధికారం వచ్చాక దిక్కుమాలిన ప్రజా సేవ చేస్తూ కూర్చుంటామా చెప్పు? అసలే మంది ప్రజాస్వామ్యం. వెధవది ఐదేళ్లు గిర్రుమని తిరిగిపోవూ? మరి  కూసింత సమయంలోనే నాకూ, నన్ను నమ్ముకున్నోళ్లకూ  పది తరాల వరకు సరిపడా వెనకేసుకోద్దూ? దానికే సరిపోయిందయ్యా టైమంతానూ. ఆఖరికి రోడ్లేయడానికి కూడా వీలు చిక్కలేనుకో. మరయితే ఇప్పుడు నువ్వు తెచ్చిన పరికరం జనాన్ని మళ్లీ మాయ చేయడానికి ఉపయోగపడుతుందంటావా? అసలది ఎలా పని చేస్తుందో చెప్పు?''

సెక్రటరీ ఉత్సాహంగా జేబులోంచి మైక్రోఫోన్లాంటి  చిన్న పరికరం తీశాడు. దాని గురించి వివరించడం మొదలెట్టాడు.

''దీన్ని ఏఐ మెంటల్డిటెక్టర్స్పీచ్ఎకో అంటారండి. సిద్ధం సభల్లో మీరు ఎంత హైరానా పడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాను కదండీ? చెప్పిందే చెబుతున్నారు. వాగిందే వాగుతున్నారు. అన్నవే అంటున్నారు. తిట్టినవే తిడుతున్నారు. అవే హామీలు తిప్పి తిప్పి ఇస్తున్నారు. అవే పథకాలు, అవే వాగ్దానాలు. వాటితోనే జనాన్ని నమ్మించడానికి కిందా మీదా పడుతున్నారు. అందుకే దీన్ని ఆర్డరిచ్చి తెప్పించానన్నమాటండి. దీన్ని  సభలోనైనా సరే మైక్కి బిగిస్తే చాలండి. దీన్లోని సెన్సర్లు మీ మనసులోని విషయాల్ని పసిగట్టి మీ గొంతులోనే చెప్పేస్తాయండి. ఇక మీరు మైకు ముందు నుంచుని కేవలం హావభావాలిస్తే చాలండి...''

''ఇదేదో బాగుందయ్యా... సిద్ధం సిద్ధం అంటూ సభలంటూ పేట్టేశాం కానీ, చెప్పడానికేముంటది? అందుకే చెప్పిన విషయం చెప్పిన చోట చెప్పకుండా చెప్పలేకపోతున్నాను. ఇంతకీ మనం ఆళ్లకి చేసింది మాత్రం ఏముంది కనక? ఇక మనకి మనం చేసుకున్నదంటావా, పైకి చెప్పలేం. ఏమంటావ్‌? మరింతకీ దీనికి నా గొంతు ఎలా తెలుస్తుందంటావ్‌?''

''అదాండీ... ఏం లేదండి. ముందుగా దీన్ని పట్టుకుని మీరు ప్రసంగించేయాలండి. ఒక్కసారి గానీ, ఇది విందంటే చటుక్కున పట్టేస్తుందండి. కృత్రిమ మేధ కదండీ? మహా చురుకన్నమాటండి. అలా ఎక్కించేశాక, ఇక చూస్కోండి... మీ మాట, మీ విరుపు, మీ తీరు, మీ వైఖరి, మీ తెంపరితనం, మీ బరితెగింపు, మీ నయవంచన, మీ నక్క వినయం, మీ మోసకరితనం, మీ మేకపోతు గాంభీర్యం... ఇలా అన్నీ ఇట్టే పట్టేస్తదండి.  తర్వాత ప్రతి సభలోనూ ముందుగా మీరు మైకు పుచ్చుకుని వంకరగా చేతులు పైకెత్తి మైకు మూతి మీద దబ్‌... దబ్‌... దబ్దబ్దబ్మంటూ కొడతారు చూడండి, అలా కొడుతూ  పరికరం మీట నొక్కితే చాలండి. ఆపై ఇది మీరు చెప్పదలుచుకున్నది, చెప్పాలనుకుంటున్నది, చెప్పలేకపోతున్నది, చెప్పకతప్పనిది, చెప్పబోయేది అన్నీ గ్రహించేసి మీ మనసంతా చదివేసి, అచ్చం మీలాగే చెప్పుకుంటూ పోతుందండి. అలా మీకిక ఆయాసం లేకుండా జనానికి ఆవేశం తెప్పించేస్తదన్నమాటండి. మీరు కేవలం వెకిలి నవ్వులు నవ్వుతూ అటూ ఇటూ చూస్తూ ఉంటే చాలన్నమాటండి. జనానికి మాత్రం అంతా మీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందండి. కాబట్టి ఒక్కసారి మీ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పండి, దీంట్లోకి ఎక్కించేద్దాం...''

అంతా విన్నాక అధినేతకి హుషారొచ్చింది.  పరికరం అతికించిన మైకు పుచ్చుకుని ప్రచార సభల్లో వాగుతున్నదంతా టేపు రికార్డర్లాగా వాగడం మొదలు పెట్టాడు.

''నా వెంట నడిచే నా ప్రతి అన్నకూ, నా ప్రతి తమ్ముడికీ, నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకీ, నా ప్రతి అవ్వకూ, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికీ... మీ బిడ్డ ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉత్సాహంగా చేరిన జన సమూహాన్ని చూస్తుంటే... తమ ప్రతి ఇంటా జరిగిన అభివృద్ధిని తిరిగి కాపాడుకోడానికి గర్జిస్తున్న సింహాల్లా కనిపిస్తా ఉన్నారు.  మూల నుంచి  మూల వరకు  జిల్లాలో చూసినా అడుగడుగునా జనసముద్రం. దారి పొడవునా జన సునామీని చూస్తుంటే... 25 కి 25 పార్లమెంటు స్థానాలూ, 175 కి 175 అసెంబ్లీ స్థానాలు గెలిపించి డబుల్సెంచరీ కొట్టించడానికి... మీరంతా సిద్ధమేనని అనిపిస్తోంది. మీ కళ్ల ముందు జరిగిన అభివృద్ధినీ, మీ ముందుకు వచ్చిన పథకాలనీ కొనసాగించాలా, వద్దా అని తేల్చే ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. నాకు ఓటేస్తేనే మీకు ప్రగతి. లేకపోతే అధోగతి. ప్రతి ఒక్క ఓటరూ కూడా  విషయాలు గమనించాలని కోరతా ఉన్నా. పేదల్ని గెలిపించాలని నేను తపిస్తుంటే, నన్ను ఓడించాలని వాళ్లు కోరుకుంటున్నారు. మన అభ్యర్థుల్ని చూడండి. ఒక్కొక్కళ్లూ నిరు పేదలు. ఒక్కొక్కళ్లూ అమాయకులు. చాలా మంచి వాళ్లు. నోట్లో వేలు పెట్టినా చీకుతారే తప్ప కొరకలేరు. వీరందర్నీ గెలిపించి మరో చారిత్రక విజయాన్ని అందించడానికి మీరంతా... మీరంతా... సిద్ధమేనా? ప్రజలకు ఎలాంటి మంచీ చేయని  మూడు పార్టీల వారికీ చెంప చెళ్లుమని సమాధానం చెప్పడానికి మీరంతా... మీరంతా... సిద్ధమేనా? నా వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపించడానికి మీరంతా సిద్ధమే కదా.....'' అంటూ అధినేత మొదలు పెట్టి, ఎక్కడికెళ్లినా,  వేదికెక్కినా చెప్పే సోదంతా సుదీర్ఘంగా  చెప్పుకుంటూ పోయాడు.

సెక్రట్రీ ఉప్పొంగిపోయాడు. ''చాలు సార్చాలు! ఇక రేపు సభలో చూస్కోండి.  కృత్రిమ మేధ పరికరం ఎంత బాగా పనిచేస్తుందో చూద్దురు గాని. మరి రాబోయే మీ పాలనలో నన్ను ఏదైనా మంచి కార్పొరేషన్కి చైర్మన్ని చేసేయాలండి మరి...'' అన్నాడు.

అధినేత ముసిముసి నవ్వులు నవ్వుతూ తలూపాడు.

+++++++++++

మర్నాడు అధినేత ప్రచార సభ మొదలైంది. అధినేత రెండు చంకలూ పైకి లేపి చేతులు కలిపి నమస్కారం చేస్తూ, రాని నవ్వును మొహాన పులుముకుంటూ వేదిక పైకి వచ్చాడు. సెక్రటరీ వినయంగా మైక్అందిస్తూ 'ఏఐ మెంటల్డిటెక్టర్స్పీచ్ఎకో' పరికరాన్ని అనుసంధానించి ఇచ్చాడు. అధినేత మైక్అందుకుని దాని మూతి మీద అలవాటుగా దబ్‌.. దబ్... దబ్ దబ్దబ్అని కొట్టాడు. అలా కొడుతూ పరికరాన్ని ఆన్చేశాడు. ఆపై  పరికరం లోంచి అచ్చం అధినేత మాట్లాడుతున్నట్టుగానే మాటలు జాలువారాయి ఇలా...

''నా వెంట నడిచే ప్రతి గొర్రెకూ, ప్రతి మేకకూ, ప్రతి వెర్రిబాగుల అన్నకు, ప్రతి అమాయక అక్కకు, ప్రతి తెలివితక్కువ చెల్లెమ్మకి,  ఆలోచించలేని ప్రతి తమ్ముడికి, బుర్రలేని ప్రతి ఓటరుకీ... మీ బిడ్డ చేతులెత్తి మస్కా కొడతా ఉన్నాడు. ఇక్కడ నిరుత్సాహంగా చేరి వెర్రిమొగాలేసుకుని, రాక తప్పక నా అనుచరులకు భయపడుతూ వచ్చిన జనాన్నిచూస్తుంటే... మీ ప్రతి ఇంటా జరిగిన నష్టాన్ని, మీ చుట్టూ జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటూ బేరుమంటున్న పిల్లుల్లా కనిపిస్తా ఉన్నారు.  మూల నుంచి  మూల వరకు  మూలకి వెళ్లినా నేను కనిపిస్తే చాలు పారిపోతున్న జనం, నేను మాట్లాడుతుండగానే ఆవులిస్తున్న జనం, లేచి వెళ్లిపోతున్న జనం, భోజనాలు ఉన్నాయని పిలుస్తున్నా దులుపుకుని చక్కా పోతున్న జన సునామీని చూస్తుంటే... 25 పార్లమెంటు స్థానాల్లో, 175 అసెంబ్లీ స్థానాల్లో ఒకటో, రెండో అయినా వస్తాయో లేదోననే భయం ఆవరిస్తా ఉంది. మీరంతా కలిసి నన్ను, నా అభ్యర్థుల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని గుబులు కలుగుతోంది. మీ కళ్ల ముందు జరిగిన అరాచకాన్ని, మిమ్మల్ని దిగజార్చిన బోగస్పథకాలని తిప్పి కొట్టడానికి వీలు కలిగించే ఎన్నికలు రాబోతున్నాయి. నాకు ఓటేస్తే ఇక మీకు అధోగతే. నాకు మాత్రమే ప్రగతి.  విషయాన్ని ప్రతి ఒక్క ఓటరూ ఏమాత్రం గ్రహించకుండా ఉండాలని కోరుతున్నా. మిమ్మల్ని వంచించి గెలవాలని నేను చూస్తుంటే, మిమ్మల్ని నా పాలన నుంచి రక్షించి కాపాడాలని వాళ్లు చూస్తున్నారు. నా అభ్యర్థుల్ని చూడండి. ఒక్కొక్కళ్లూ పేదల రక్తం తాగే జలగలు. ఒక్కొక్కళ్లూ నయవంచకులు. గూండాలు. ముష్కరులు. కర్కశులు. మీ చుట్టూ ఉన్న కొండలు, కోనలు, గనులు, వనరులు దోచుకున్న దుండగులు. ఒక్కొక్కళ్లూ మీ డబ్బుని దండుకుని కోట్లకు పడగలెత్తిన మహా మాయగాళ్లు. నా వెర్రి గొర్రెల్లారా... నేను మీటలు నొక్కి దాదాపు మూడు లక్షల కోట్లు మీ కాతాల్లోకి వేశానని చెబుతున్నాను. కానీ ఏకంగా 13 లక్షల కోట్లు  అప్పుల్లో మిమ్మల్ని ముంచేసిన విషయం గ్రహించకండి. అలా మీ ప్రతి ఒక్కరి తల మీద ఇప్పుడు మూడు లక్షల రూపాయల భారం పడేలా చేసిన సంగతి తెలుసుకోకండి. ధరలు, పన్నులు, ఛార్జీలు ఇష్టం వచ్చినట్టు పెంచేసి మీలో ప్రతి ఒక్కరి కుటుంబంపైనా పది లక్షల భారాన్ని మోపానని అర్థం చేసుకోకండి. రాష్ట్రాన్ని గంజాయి, మాదక ద్రవ్యాల కేంద్రంగా మార్చిన విషయాన్ని గుర్తించకండి. భూములు, ఎర్రచందనం, రేషన్బియ్యం రూపంలో లక్షల కోట్లు కొట్టేసినట్టు పసిగట్టకండి. సొంత చెల్లెలి పుట్టుకపైనే నిందలేసి, తల్లి వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచిన విలువల్లేని వ్యక్తిగా నన్ను పోల్చుకోకండి. ఏకంగా 14 లక్షల ఎకరాల ఎసైన్డ్భూముల్ని కబ్జా చేసిన నా పాలనను ఓటేసేటప్పుడు తల్చుకోకండి. ఇసుక ధర నాలుగు రెట్లు పెంచేసి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన విషయాలు పట్టించుకోకండి. అంతక్రితం మీకు మేలు చేసిన వంద పథకాలను రద్దు చేసిన సంగతిని మర్చిపొండి. మద్య నిషేధం చేశాకే ఓట్లడుగుతానన్న నా నయవంచక మాటల్ని జ్ఞాపకం చేసుకోకండి. అమ్మ ఒడి పేరుతో ముష్టి పదమూడు వేలు పడేసి, నాన్న మందు బుడ్డి ద్వారా లక్షలాది రూపాయలు మీ దగ్గరి నుంచే లాగేసి మీ కుటుంబాల్ని అణగార్చి వేసిన నిజాన్ని మర్చిపొండి. పైకి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూనే మీలో ఆరు వందల మందిని హత్య చేయించిన నా పాలన తీరును లెక్కచేయకండి. రాబోయే ఎన్నికల్లో నన్ను మరోసారి నమ్మి మోసపోవడానికి మీరంతా... మీరంతా... మీరంతా... సిద్ధమేనా? సిద్ధమేనా?....''

అధినేత మైకు పుచ్చుకోగానే లేచి వెళ్లిపోతున్న జనాలందరూ లౌడ్స్పీకర్లో వినిపిస్తున్న మాటలకి వెనక్కి వచ్చి మరీ నవ్వసాగారు. కేరింతలు కొట్టసాగారు. చప్పట్లు కొట్టసాగారు.

+++++++

అధినేత ముఖం జేవురించి ఉంది.

''ఏంటిది సెక్రట్రీ! ఇలా జరిగిందేంటి?'' అన్నాడు కోపంగా.

''అయ్యా నేను ముందే చెప్పానండి. అది మీ మనసులో మాటల్ని సెన్సర్ల ద్వారా గ్రహించి మీ మాటల్లా పలికేస్తుందని. మరి మీరు పైకి చెప్పేదొకటి, మనసులో అనుకునేదొకటని నాకేం తెలుస్తుందండీ?''

''మరేదో కృత్రిమ మేధన్నావ్?''

''అది కృత్రిమ మేధ కాబట్టే మీ వికృత మేధని గ్రహించేసిందండి...''

అధినేత నోట మాట లేదు!!!

-సృజన

PUBLISHED ON 1.5.2024 ON JANASENA WEB SITE