ఆహ్లాదం
అక్షరాల సీమలో నా ప్రయాణం
శుక్రవారం, సెప్టెంబర్ 18, 2026
చిత్రగుప్తుడి సందేహం... యమ ధర్మరాజు సమాధానం (ఏది పెద్ద పాపం?)
అనగనగా ఒక రాజ్యంలో ఎంతో దయాగుణం కలిగిన ఒక రాజు ఉండేవాడు. ప్రజలను తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ, వారికి నిరంతరం అన్నదానాలు చేసేవాడు. ఒకరోజు తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా రాజ్యం మొత్తానికి వైభవంగా విందు భోజనం ఏర్పాటు చేశాడు.
అయితే, అదే సమయంలో ఆకాశంలో ఒక రాబందు ఒక పామును నోట పట్టుకుని ఎగురుతోంది. ఆ రాబందు పట్టు నుంచి తప్పించుకోవడానికి పాము ఆకాశంలోనే విషాన్ని చిమ్మింది. దురదృష్టవశాత్తు, ఆ పాము విషపు చుక్కలు కింద రాజుగారి విందు కోసం సిద్ధం చేసిన వంటకాల పాత్రలో పడిపోయాయి.
ఈ విషయం రాజుకి కానీ, వంటల వారికి కానీ తెలియదు. విందు ప్రారంభమయ్యాక, మొదటి పంక్తిలో భోజనం చేసిన కొందరు ప్రజలు ఆ విషాహారం తిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటనతో రాజ్యంలో అలజడి రేగింది. అక్కడే ఉన్న ఒక మహిళ, "ప్రజలను చంపడానికే రాజు కావాలని భోజనంలో విషం కలిపి చంపేశాడు!" అని ఊరంతా చాటింది. ఆ అపనిందతో రాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ బాధతోనే మంచం పట్టి కొద్దిరోజుల్లోనే కన్నుమూశాడు. కాలక్రమేణా, ఆ అబద్ధ ప్రచారం చేసిన మహిళ కూడా మరణించింది.
యమలోకంలో న్యాయ విచారణ:
అమాయకులైన ప్రజల చావుకు కారకులు ఎవరు? ఎవరి ఖాతాలో ఈ పాపాన్ని రాయాలి? అనే అంశంపై యమలోకంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడి మధ్య పెద్ద చర్చ మొదలైంది.
చిత్రగుప్తుడు: "ప్రభూ! ప్రాణాలు తీసిన ఆ పాము ఖాతాలో ఈ పాపాన్ని రాయమంటారా?"
యమధర్మరాజు: "కాదు! పాము తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగా విషం చిమ్మింది. కాబట్టి దానిది తప్పు కాదు."
చిత్రగుప్తుడు: "అయితే పామును పట్టుకొచ్చిన ఆ రాబందుది తప్పా?"
యమధర్మరాజు: "కాదు! రాబందు తన ఆకలి తీర్చుకోవడానికి ఆహారాన్ని వెతుక్కుంది. అది ప్రకృతి సిద్ధమైన నియమం. కాబట్టి దానిదీ తప్పు కాదు."
చిత్రగుప్తుడు: "మరి భోజనం పెట్టిన రాజుగారిది తప్పా?"
యమధర్మరాజు: "అస్సలు కాదు! రాజు ఎంతో మంచి మనసుతో ప్రజల కడుపు నింపాలని విందు పెట్టాడు. ఆహారంలో విషం కలిసిందనే నిజం ఆయనకు తెలియదు."
అప్పుడు చిత్రగుప్తుడు ఆశ్చర్యపోతూ... "ఈ పాపాన్ని ఎవరి కాతాలో రాయాలి?" అని అడిగాడు.
దానికి యమధర్మరాజు చిరునవ్వుతో... "నిజం ఏంటో తెలుసుకోకుండా, కేవలం ఊహించుకుని రాజుపై నిందలు వేసి సమాజంలో విషాన్ని చిమ్మిన ఆ మహిళ కాతాలో వెయ్యి" అని తీర్పు ఇచ్చాడు.
ఈ కథ మనకు నేర్పే జీవన సత్యం
నోటి మాటపై అదుపు ఉండాలి: మనం చూసింది, విన్నది నిజమో కాదో పూర్తి ఆధారాలు లేకుండా ఎదుటివారిపై నిందలు వేయడం చాలా పెద్ద తప్పు. మన ఒక మాట ఒకరి జీవితాన్ని, ప్రతిష్టను నాశనం చేయవచ్చు.
ఎవరి గురించైనా మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి... మీరు వేసే నింద నిజమైనదేనా? లేక మీ ఊహాజనితమైనదా? నిజం తెలియని మాటలు మీ జీవితానికే ప్రమాదకరంగా మారవచ్చు!
గురువారం, సెప్టెంబర్ 17, 2026
మంత్రాల ప్రభావంపై సైన్స్ ఏం చెబుతోంది?
*ప్రశ్న 1:*
`మంత్రాలు మనిషి ఆయుష్షును పెంచుతాయా? ఏ మంత్రం చదివితే ఆయుష్షు ఎలా పెరుగుతుందో ఆధునిక సైన్స్ ఎప్పుడైనా పరిశోధించిందా?`
*జవాబు:*
`'అవును, కచ్చితంగా పరిశోధించింది!' ఆధునిక సైన్స్ కేవలం మంత్రం మీదే కాకుండా, ఆ మంత్రం పలికేటప్పుడు గొంతులో, నాభిలో పుట్టే పౌనఃపున్యం (Frequency) మరియు శ్వాస లయ (Rhythm) మీద దశాబ్దాలుగా ప్రయోగాలు చేసి అద్భుతమైన నిజాలను వెలికితీసింది. ఆయుష్షును పెంచే ప్రధానమైన మూడు నాదాలు/మంత్రాలు వాటిపై జరిగిన అంతర్జాతీయ పరిశోధనలు ఈ వాస్తవాలను నిర్ధారించాయి.`
*ప్రశ్న 2:*
`గాయత్రీ మంత్రం మెదడు ఆయుష్షును (Cognitive Longevity) ఎలా పెంచుతుంది?`
*జవాబు:*
`గాయత్రీ మంత్రం ఋగ్వేదంలో (3వ మండలం) ఉన్న అత్యంత శక్తివంతమైన మంత్రం.`
`సైంటిఫిక్ నిరూపణ: న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) మరియు ఐఐటీ (IIT Delhi) శాస్త్రవేత్తలు సంయుక్తంగా మ్యాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ (MEG) స్కాన్ల ద్వారా భారీ ప్రయోగాలు చేశారు. ఈ మంత్రంలోని నిర్దిష్టమైన అక్షరాల (తత్ సవితుర్వరేణ్యం..) కలయికను పలికేటప్పుడు మెదడులోని 'ప్రీఫ్రంటల్ కార్టెక్స్' విపరీతంగా ఉత్తేజితం అవుతుందని తేలింది.`
*ఆయుష్షు పెంపు:
`ఈ మంత్ర ఉచ్చారణ వల్ల మెదడులో 'గ్రే మ్యాటర్' పెరుగుతోంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (Dementia, Alzheimer's) రాకుండా అడ్డుకుంటుంది. మెదడు కణాలు త్వరగా క్షీణించకుండా కాపాడటం ద్వారా మనిషి మానసిక ఆయుష్షును ఇది పదిలపరుస్తుంది.`
*ప్రశ్న 3:*
`గాయత్రీ మంత్రం ఏది? అందులో ఏ అక్షరాలు ఉంటాయి? దాని అర్థం ఏమిటి?`
*జవాబు:*
`"గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ" – అంటే, ఎవరు దీనిని పఠిస్తారో, వారిని అజ్ఞానం, భయం మరియు జీవిత సమస్యల నుండి రక్షించే మంత్రం.`
*గాయత్రి మంత్రం యొక్క
ప్రతి పదార్థ వివరణ:-
*ఓం (Om):*
`ప్రణవ నాదం, పరమాత్మ స్వరూపం.`
*భూర్ (Bhūḥ):*
`భూలోకం (అస్తిత్వానికి ఆధారం).`
*భువః (Bhuvaḥ):*
`భువర్లోకం (అంతరిక్షం, ప్రాణశక్తి).`
*స్వః (Svaḥ):*
`సువర్లోకం (స్వర్గం, ఆనందమయ స్థితి).`
*తత్ (Tat):*
`ఆ (నిర్గుణ పరబ్రహ్మను సూచించేది).`
*సవితుర్ (Savitur):*
`సకల సృష్టికి మూలమైన ఆ ప్రేరణ శక్తికి (ప్రేరకుడు).`
*వరేణ్యం (Vareṇyam):* `కోరుకోదగిన అత్యున్నతమైన, లేదా వరించదగిన ఆరాధించ దగిన.`
*భర్గః (Bhargaḥ):*
`పాపాలను, అజ్ఞానాన్ని దహించే దైవిక తేజస్సు.`
*దేవస్య (Devasya):*
`ప్రకాశించే స్వభావం గల దైవం యొక్క.`
*ధీమహి (Dhīmahi):*
`మేము ధ్యానిస్తున్నాము.`
*ధియో (Dhiyaḥ):*
`బుద్ధులను.`
*యో (Yaḥ):*
`ఏ (తేజశ్శక్తి/పరమాత్మ) అయితే.`
*నః (Naḥ):*
`మమ్మల్ని / మా యొక్క.`
*ప్రచోదయాత్ (Pracodayāt):* `ప్రేరేపించుగాక (సన్మార్గంలో నడిపించుగాక).`
`చాలా ప్రార్థనలూ మంత్రాలూ వ్యక్తిగత కోరికల కోసం ఉంటాయి. కానీ గాయత్రి` 'నః' (మా యొక్క) `అని వేడుకుంటుంది. అంటే, ఇది లోకంలోని సమస్త మానవాళికి కావలసిన` 'జ్ఞానం' `మరియు` 'వివేకం' `కోసం చేసే సార్వత్రిక ప్రార్థన.`
*ప్రశ్న 4:*
`మంత్రాలు పఠిస్తున్నప్పుడు` 'వేగస్ నెర్వ్' `ఎలా యాక్టివేట్ అవుతుంది? అప్పుడు విడుదలయ్యే ద్రవం ఏమిటి?`
*జవాబు:*
`మన శరీరంలోని 10వ క్రానియల్ నెర్వ్ అయిన ఈ` 'వేగస్ నెర్వ్' (Vagus Nerve) `మెదడు నుండి మొదలై, గొంతు (Vocal cords), గుండె, మరియు జీర్ణవ్యవస్థల గుండా ప్రయాణిస్తుంది.`
`మంత్రం పఠించేటప్పుడు మనం 'దీర్ఘ శ్వాస' తీసుకుని, శబ్దాన్ని ఉచ్చరిస్తూ 'నెమ్మదిగా గాలి వదులుతాము' (Extended exhalation).`
`వేగస్ నెర్వ్ గాలి వదిలే సమయంలో మరియు గొంతులో వచ్చే ప్రకంపనల (Vibrations) వల్ల యాక్టివేట్ అవుతుంది.`
`అప్పుడు విడుదలయ్యే ద్రవం` ఎసిటైల్ కొలిన్ (Acetylcholine). `(1921లో ఒట్టో లోవి దీనిని కనుగొని దీనికి Vagusstoff అని పేరు పెట్టారు).`
`ఈ రసాయనం గుండె రక్తనాళాలను విశాలం చేసి, హృదయ స్పందనను నెమ్మదించేలా చేస్తుంది. శరీరంలో ఒత్తిడి ఆగిపోయి,` 'రెస్ట్ అండ్ డైజెస్ట్' (Rest and Digest) `అనే ప్రశాంతమైన వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.`
*ప్రశ్న 5:*
`ప్రాచీనులు సూచించినట్లు 108 సార్లు పఠించడానికి ఎంత సమయం పడుతుంది?`
*జవాబు:*
`ప్రాచీనులు సూచించిన క్రమబద్ధమైన శ్వాస (Resonant breathing) ప్రకారం, ఒక మనిషి నిమిషానికి 5.5 నుండి 6 సార్లు శ్వాస తీసుకోవాలి.`
`ఒకసారి గాయత్రీ మంత్రం పఠించడానికి (దీర్ఘంగా గాలి పీల్చి, మంత్రం ఉచ్చరిస్తూ గాలి వదలడానికి) సుమారు 10 సెకన్ల సమయం పడుతుంది. అనగా నిమిషానికి సరిగ్గా 6 సార్లు.`
`108 సార్లు పూర్తి చేయడానికి: 108 / 6 = సరిగ్గా 18 నిమిషాలు పడుతుంది. (సగటున 5.5 శ్వాసల చొప్పున పఠిస్తే సుమారు 20 నిమిషాలు పడుతుంది).`
*ప్రశ్న 6:*
`మహామృత్యుంజయ మంత్రం కణాల మరమ్మత్తు (Cellular Repair) ఎలా చేస్తుంది?`
*జవాబు:*
"త్ర్యంబకం యజామహే.." `అంటూ సాగే ఈ మంత్రం ఋగ్వేదంలో (7వ మండలం) ఉంది. ఇది ప్రాణరక్షణకు ప్రసిద్ధి.`
*సైంటిఫిక్ నిరూపణ: `హార్వర్డ్ మెడికల్ స్కూల్ (USA), ఎన్ఐఎంహెచ్ఎన్ఎస్ (NIMHANS - India) అధ్యయనాల ప్రకారం, ఈ మంత్రంలోని మహాప్రాణ అక్షరాల కూర్పు దేహంలో` 'లో-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్' `సృష్టిస్తుంది..`
*ఆయుష్షు పెంపు: `ఈ వైబ్రేషన్స్ శరీరంలో దీర్ఘకాలిక వాపును (Chronic Inflammation) తగ్గించి, ప్రమాదకరమైన` 'సైటోకిన్' (Cytokines) `స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా కణాల లోపల ఉండే` 'టెలోమెరేస్' (Telomerase) `అనే ఆయుష్షు ఎంజైమ్ను చురుగ్గా మారుస్తాయి. దీనివల్ల కణాలు ముసలిబారిపోవడం (Cellular Senescence) నెమ్మదిస్తుంది.`
*ప్రశ్న 7:*
`'ఓం' కారం (Pranava Nada) చదవడం వల్ల గుండెకు జరిగే లాభం ఏమిటి?`
*జవాబు:*
`వేద మంత్రాలకు మూలం ఈ ఓంకారమే. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధన ప్రకారం, 'ఓం' అని దీర్ఘంగా పలికినప్పుడు వచ్చే అనునాదం (Resonance) కచ్చితంగా 0.1 Hz పౌనఃపున్యానికి వస్తుంది (ఇది భూమి సహజ పౌనఃపున్యం). దీనివల్ల 'హార్ట్ రేట్ వేరియబిలిటీ' (HRV) పెరుగుతుంది. ఎవరికైతే గుండె లయ (HRV) ఎక్కువగా ఉంటుందో, వారు వందేళ్లు దాటి జీవిస్తారని మెడికల్ సైన్స్ ఘంటాపథంగా చెబుతోంది.`
*ప్రశ్న 8:*
`ఈ మంత్రాలను ఎవరు, ఎక్కడ, ఎంతసేపు చదవాలి? (The Protocol)`
*జవాబు:*
`మంత్రం అనేది ఒక బయోలాజికల్ టూల్ (Biological tool). దానికీ కులానికీ, మతానికీ సంబంధం లేదు.`
*ఎవరు చదవాలి?: `ఎవరైనా చదవచ్చు. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా ఉచ్చారణ దోషం లేకుండా స్పష్టంగా పలకగలిగే ప్రతి ఒక్కరూ చదవవచ్చు.`
*ఎక్కడ చదవాలి?: `ఇంట్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే చోట లేదా ఆరుబయట. ఎందుకంటే, మహాప్రాణాలు పలికేటప్పుడు ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అవసరం.`
*ఎంతసేపు చదవాలి?: `రోజంతా జపమాలలు పట్టుకుని కూర్చోవాల్సిన పనిలేదు. ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో కేవలం 10-15 నిమిషాలు లయబద్ధంగా పఠిస్తే చాలు. ఇది డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ చెప్పిన` 'రిలాక్సేషన్ రెస్పాన్స్' (Relaxation Response) `ను యాక్టివేట్ చేసి, రోజంతా కణాలను సేఫ్ మోడ్లో ఉంచుతుంది.`
*శాస్త్రీయ ఆధారాలు:
`వేద మంత్రాల లయబద్ధమైన పఠనం శరీరంలో ఒక` 'బయో-ఎకౌస్టిక్ రెజోనెన్స్' (జీవ-ధ్వని అనునాదం) `సృష్టిస్తుందని నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ (NBRC) నిరూపించింది. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి, కణాలలో` 'టెలోమెరేస్' (Telomerase) `అనే ఎంజైమ్ చురుగ్గా మారుతుంది. సైన్స్ ప్రకారం, ఈ ఎంజైమ్ నేరుగా మనిషి కణాల ఆయుష్షును పెంచడానికి మరియు జన్యువుల మరమ్మత్తుకు కారణమవుతుంది.`
*Proof 2: `ఎయిమ్స్ (AIIMS), ఐఐటీ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన fMRI పరిశోధనల్లో, గాయత్రీ మంత్రం పఠించడం వల్ల మెదడులోని` ప్రీఫ్రంటల్ కార్టెక్స్ `అత్యంత చురుగ్గా మారినట్లు తేలింది. ఈ నాడీ ఉత్తేజం వల్ల వయసు పైబడే కొద్దీ వచ్చే` 'మతిమరుపు' (Dementia) `వంటి మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోబడతాయి.`
*Proof 3:
`ఇటలీ పరిశోధకుడు డాక్టర్ లూసియానో బెర్నార్డి నిర్వహించిన అధ్యయనంలో, వయోజనులు లయబద్ధంగా మంత్రాలను పఠిస్తున్నప్పుడు వారి శ్వాస రేటు సహజంగానే నిమిషానికి కచ్చితంగా 6 శ్వాసలకు పడిపోయిందని నిరూపించబడింది. ఈ కచ్చితమైన ఫ్రీక్వెన్సీ నేరుగా వేగస్ నెర్వ్ను ప్రేరేపించి, అత్యంత లోతైన శారీరక ప్రశాంతతను మరియు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని ఇచ్చిందని స్పష్టమైంది.
ఆధారం:
`బ్రిటీష్ మెడికల్ జర్నల్ (BMJ), సంపుటం 323, పేజీలు 1446-1449.`
(`ఇలాటి మంచి విషయాలకోసం…‘భగవంతుని విషయాలు’ గ్రూప్ లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు)
మంగళవారం, సెప్టెంబర్ 15, 2026
బాబా... భక్తి... భలే సినిమా!
బాబా జీవితం వేరు...
ఆయనపై భక్తి వేరు...
సినిమా ప్రపంచం వేరు...
ఈ మూడు వేర్వేరు అంశాలు కలిసి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి!
ఆ సంచలనం పేరు ‘హనుమాన్ అంశ్’!
ఆగస్టు 7న సాదాసీదాగా విడుదలైన ఓ హిందీ సినిమా...
తొలి రోజు కేవలం రూ. 10 లక్షలు వసూలు చేసింది... రెండు వారాలైనా వసూళ్లు అంతంత మాత్రమే... చాలా మంది ‘డిసాస్టర్’ అనేశారు...
కానీ ఆ తర్వాత జరిగింది అద్భుతం...
మూడో వారం నుంచి కేవలం ప్రేక్షకుల నోటి ప్రచారం వల్ల వసూళ్లు పుంజుకున్నాయి. నాలుగైదు వారాల్లో ఊహించని విధంగా పెరిగాయి. మొదటి వారంలో కేవలం 250 తెరలపై ఆడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ఆదరణ వల్ల 8000 తెరలకు పెంచాల్సి వచ్చింది. సెప్టెంబర్ 11న ఓవర్సీస్ లో కూడా విడుదలైంది.
విడుదలైన 39 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూలు చేసింది. భారత్లో రూ. 263 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది.
నలుగురు కలిసి కష్టపడి పోగుచేసుకున్న డబ్బు... రూ. 2 కోట్లు!
ఆ డబ్బుతో తీసిన ఈ సినిమా చేసిన వసూళ్లు... రూ. 280 కోట్లు!
అంటే.. పెట్టుబడికి 140 రెట్ల లాభం!
ఈ సినిమా గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా అదెంత ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలుసు.
ఆ సినిమాను ప్రేక్షకులు చెప్పులు విప్పేసి మరీ భక్తితో చూస్తున్నారు...
కొన్ని సన్నివేశాల్లో లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు...
కొన్ని చోట్ల కంటతడి పెడుతున్నారు...
చివరకు రామ నామంతో, హనుమాన్ స్మరణతో బయటకి వస్తున్నారు...
ఆ సినిమాలో గొప్ప స్టార్లు లేరు...
హీరోయిన్ లేదు...
ఉర్రూతలూగించే డ్యూయెట్లు లేవు...
ఫైట్లు, డ్రామా, కామెడీ లాంటి కమర్షియల్ మసాలాలేవీ లేవు...
కేవలం ఓ బాబా జీవిత కథ అది...
ఇల్లు విడిచి పెట్టి వెళ్లిపోయిన ఓ చిన్న పిల్లాడు ఆధ్యాత్మిక సాధనతో బాబాగా ఎలా మారాడో చెప్పే కథ...
అతడు చూపించిన మహిమలు, ప్రభావం గురించిన కథ...
ఆ బాబా పేరు ‘నీమ్ కరోలీ బాబా’.
అంతర్జాతీయంగా పేరు పొందిన ఆధ్యాత్మిక గురువు.
భారత్లోనే కాకుండా స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్ వంటి ఎందరో ప్రపంచ ప్రముఖులను సైతం ప్రభావితం చేసిన గొప్ప అవధూత.
· నలుగురు భక్తులు కలిసిన వేళ...
‘హనుమాన్ అంశ్’ సినిమా గురించి చెప్పుకోవాలంటే నలుగురి గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా వెండితెర రూపం వెనుక వాళ్ల భక్తి ఉంది. తపన ఉంది. పట్టుదల ఉంది.
నలుగురివీ వేర్వేరు నేపథ్యాలు...
వృత్తి రీత్యా వైద్యుడు ఒకరైతే, లండన్ లో చదువుకున్న అమ్మయి మరొకరు. మీడియా ప్రొడక్షన్ వ్యాపార రంగానికి చెందిన యువతులు ఇద్దరు...
ఒక విధంగా చెప్పాలంటే... వీరిని బాబా మీద భక్తే ఈ సినిమాకు సహ నిర్మాతలకుగా చేసింది.
సినిమా రచయిత, దర్శకుడు డాక్టర్ చతుర్వేది. సినిమా నేపథ్యం లేకపోయినా బాబా ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆసక్తితో కథ రాసుకున్నాడు. ‘స్వయం భూ మీడియా నెట్వర్క్’ ద్వారా సినిమాకు శ్రీకారం చుట్టాడు. సంప్రదాయ మీడియా ప్రొడక్షన్ వ్యాపార రంగానికి చెందిన నమ్రత జి. సింగ్, సాంస్కృతిక విశేషాలను సినిమాల ద్వారా చూపించే స్వతంత్ర నిర్వాహకురాలు రాగిణి ఎస్ కూడా చేయి కలిపారు. వీళ్లు తామ దగ్గరున్న కొద్ది పాటి సొమ్ముతో బాబా మీద సినిమాను మొదలుపెట్టారు. షూటింగ్ చిత్రకూట్ లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య కేవలం 22 రోజుల్లోనే ముగిసింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కానీ, విడుదలకి కానీ డబ్బులు సరిపోలేదు. ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేద్దామనుకున్నా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో అనుప్రియ నాగర్ అనుకోకుండా వీరిని కలిసింది. ముంబైలో పుట్టి, లండన్ లో ‘యూనివర్శిటీ ఆఫ్ బాత్’ నుండి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ గా బయటకు వచ్చిన ఈ 21 ఏళ్ల అమ్మాయికి, బాబా గురించి తెలియడం కూడా కాకతాళీయమే. కాలేజీలో ఓ అసైన్ మెంట్ కోసం ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సమాచారం సేకరిస్తుంటే... స్టీవ్ జాబ్స్ రాసిన ఓ వ్యాసం ద్వారా బాబా గురించి తొలిసారి తెలుసుకుంది. భారతీయురాలినై ఉండి, ఓ భారతీయ ఆధ్యాత్మిక వేత్త గురించి విదేశీయుల ద్వారా తెలుసుకోవడమేంటనే భావనతో బాబా జీవితం చదివింది. ఎంతగానో ప్రభావితమైంది. స్విట్జర్లాండులో ఓ మంచి ఉద్యోగంలో చేరాల్సి ఉన్నప్పటికీ, నీల్ కరోలీ బాబా గురించి ఓ పుస్తకం రాయాలనే ఉద్దేశంతో భారత్ బయల్దేరింది. వచ్చాక ఓ కుటుంబ స్నేహితురాలి ద్వారా ‘హనుమాన్ అంశ్’ సినిమా గురించి తెలిసింది. ఆ సినిమా స్క్రిప్టు చదివి తాను విదేశాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా పోగుచేసుకున్న సొమ్మును పోస్ట్ ప్రొడక్షన్ కోసం అందించి సహ నిర్మాతగా మారింది.
ఇప్పుడు ‘హనుమాన్ అంశ్’ సినిమా సంచలన విజయంతో ఈ నలుగురి పేర్లూ ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి.
· అనుకోకుండానే బాబా పాత్రలో...
‘హనుమాన్ అంశ్’ సినిమాలో బాబా పాత్రలో నటించిన నటుడు శోభినవ్ సత్య. ఈయనకి ఈ అవకాశం దక్కడం కూడా అనుకోకుండానే జరిగింది. మొదట్లో బాబా పాత్ర కోసం ఒక ముఖ్యమైన నటుణ్ణి అనుకుంటే అతను జబ్బుపడి తప్పుకున్నాడు. సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న శోభినవ్ కు ఆ వేషం దక్కింది. ఇప్పుడు అతడి నటన గురించి దేశమంతా మాట్లాడుతోంది.
· కొసమెరుపులు...
ఈ చిత్రం అందించిన అపారమైన విజయంతో డాక్టర్ విశాల్ చతుర్వేది తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ‘రామ్ చరిత్ మానస్’ ‘హనుమాన్ చాలీసా’లను లోకానికి అందించిన గోస్వామి తులసీదాస్ జీవిత చరిత్ర ఆధారంగా 'రామ్బోలా' చిత్రాన్ని తీయబోతున్నాడు.
· తెలుగులోకి...
హిందీలో సంచలన విజయం సాధించిన ‘హనుమాన్ అంశ్’ సినిమాను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో అందించనున్నారు. ఈయన సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్వారా దీన్ని సెప్టెంబర్ 18న తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది.
శుక్రవారం, సెప్టెంబర్ 11, 2026
ఉప్పు అప్పులో అమ్మ రహస్యం
మా అమ్మ ఇరుగుపొరుగు వాళ్లను తరచూ "ఉప్పు" అడిగేది...
మా ఇంట్లో ఎప్పుడూ బోలెడంత ఉప్పు ఉండేది. అయినా సరే... ఎవరి దగ్గరైనా "ఉప్పు" అడుగుతూనే ఉండేది.
చిన్నప్పటి నుంచి అది నాకు అస్సలు అర్థం కాకపోయేది.
‘ఇంట్లో "ఉప్పు" ఉండగా, మళ్లీ ఎందుకు అడుగుతోంది?’ అని చాలాకాలం ఆలోచించేవాడిని.
ఒకరోజు ఇక ఆగలేక అమ్మనే అడిగేశాను. అమ్మ నవ్వుతూ చెప్పింది...
‘‘మన దగ్గర ఉప్పు లేదని అడగడం కాదు నాన్నా... మన పొరుగింటి వాళ్ల దగ్గర "డబ్బు" కాస్త తక్కువ. వాళ్లకు ఏదైనా అవసరం వచ్చినప్పుడల్లా! మన దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. నేనూ సంతోషంగా ఇస్తుంటాను. కానీ! ఎప్పుడూ, మనమే ఇస్తూ ఉంటే...వాళ్లకు తెలియకుండానే, మనం తీసుకునే వాళ్లం... వాళ్లు ఇచ్చేవాళ్లు అనే చిన్న న్యూనతా భావం కలుగుతుంది. అందుకే... నాకు అవసరం లేకపోయినా, వాళ్ల దగ్గర ఏదో ఒకటి అడుగుతుంటాను. ఉప్పు కావచ్చు...పంచదార కావచ్చు... ఇంకేదైనా కావచ్చు.అలా అడగడం ద్వారా! వాళ్లకు ఒక విషయం గుర్తు చేస్తుంటాను...మీరు కూడా మాకు అవసరమే... మా జీవితంలో మీకూ, ఒక స్థానం ఉంది అని.
వాళ్లు మన దగ్గర ఏదైనా తీసుకున్నప్పుడల్లా; మనం వాళ్లకు ఋణపడి ఉన్నాం అనే భావనకలగ కూడదు.వాళ్లు కూడా మనకు ఏదో ఒకటి ఇస్తున్నారు... మనకు కూడా, వాళ్ల అవసరం ఉంది... అనే ఆత్మగౌరవం వాళ్లలో ఉండాలి’’
అమ్మ అడిగింది "ఉప్పు" కాదు...
ఒక మనిషి "మనసును.
అమ్మ చేతిలోని ఆ చిన్న గిన్నె "ఉప్పు" వెనుక ఇంత పెద్ద "మనసు" దాగి ఉందని అప్పుడు మొదటిసారి తెలుసుకున్నాను.
సద్గుణాలు కొనే వ్యాపారి (పిల్లల కథ)
ఒక వ్యాపారవేత్త తనకున్న సంపదకు తగ్గట్టుగా దానధర్మాలు చేసేవాడు. ఆయన ఎల్లప్పుడూ యజ్ఞాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఒకసారి ఆయన తన సంపదనంతటినీ ఒక యజ్ఞానికి దానం చేసేశాడు. ఇప్పుడు ఆయనకు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కూడా డబ్బు లేదు.
అతని భార్య ఇలా చెప్పింది—“దగ్గరలోని ఒక పట్టణంలో ఒక పెద్ద వ్యాపారి ఉన్నాడు. అతను ప్రజల సద్గుణాలను కొంటాడు. నువ్వు అతని దగ్గరకు వెళ్లి నీ సద్గుణాలలో కొన్నింటిని అమ్మి కొంత డబ్బు సంపాదించు. ఆ డబ్బుతో మనం మన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు.”
ఆ వ్యాపారవేత్తకు సద్గుణాలను అమ్మాలనే ఉద్దేశం అస్సలు లేదు. కానీ తన భార్య కోరిక మరియు పిల్లల మీదున్న శ్రద్ధ వలన అతను అంగీకరించాడు. అతని భార్య దారిలో తినడానికి నాలుగు రొట్టెలను ఇచ్చింది. ఆ వ్యాపారవేత్త నగరం వైపు నడిచాడు. అతనికి ఆకలిగా ఉంది. నగరంలోకి ప్రవేశించే ముందు, 'ముందు ఈ రొట్టెలు తింటాను' అని అనుకున్నాడు.
అతను రొట్టె బయటకు తీసుకురాగానే, ఒక ఆడ కుక్క తన మూడు చిన్న పిల్లలతో అతని దగ్గరకు వచ్చింది. అది వర్షం కురుస్తున్న రోజు, ఆ కుక్క అడవిలో పిల్లలను కన్నది. ఆ పిల్లలు చాలా చిన్నవి కావడంతో, అది వాటిని వదిలి ఆహారం కోసం వెతకలేకపోయింది.
వ్యాపారవేత్తకు జాలి కలిగింది. అతను కుక్కకు ఒక రొట్టె ఇచ్చాడు. కుక్క దాన్ని క్షణంలో తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఆయాసపడుతూనే ఉంది. వ్యాపారవేత్త రెండవ రొట్టెను, ఆ తర్వాత మూడవది, చివరకు నాలుగు రొట్టెలను కుక్కకు ఇచ్చాడు.
అతడు నీళ్ళు మాత్రమే తాగి వర్తకుడి దగ్గరకు వెళ్ళాడు. అతడు వర్తకుడితో, “నేను నా పవిత్రతను అమ్ముకోవడానికి వచ్చాను,” అని చెప్పాడు. ఆ సమయంలో వర్తకుడు పనిలో నిమగ్నమై ఉన్నాడు. అతడు, “సాయంత్రం పూట రా,” అని చెప్పాడు.
పగటిపూట, ఆ వర్తకుడు భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి తన భార్యతో ఇలా అన్నాడు—"ఒక వ్యాపారి తన సద్గుణాన్ని అమ్ముకోవడానికి వచ్చాడు. అతని ఏ సద్గుణాన్ని నేను కొనాలి?" ఆ వర్తకుని భార్య పతివ్రత, ధార్మికత గల స్త్రీ. ఆ రోజు ఆ వర్తకుడు ఒక ఆకలితో ఉన్న కుక్కకు, దాని పిల్లలకు రొట్టె తినిపించాడని ఆమె ధ్యానించి గ్రహించింది. ఆమె తన భర్తతో ఇలా చెప్పింది—"ఈ రోజు అతను చేసిన సద్గుణాన్ని కొను. ఆకలితో ఉన్న జంతువుకు ఆహారం పెట్టి దాని ప్రాణాన్ని కాపాడటమే అతని గొప్ప సద్గుణం."
సాయంత్రం, ఆ వ్యాపారవేత్త మళ్ళీ వర్తకుని వద్దకు వచ్చాడు. వర్తకుడు ఇలా అన్నాడు—"మీరు ఈరోజు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలనుకుంటున్నాను." దానికి వర్తకుడు నవ్వి ఇలా అన్నాడు—"యజ్ఞం చేయడానికి నా దగ్గర డబ్బు ఉంటే, పుణ్యాన్ని అమ్ముకోవడానికి మీ దగ్గరకు ఎందుకు వస్తాను?"
వ్యాపారి ఇలా అన్నాడు—“ఈ రోజు మీరు ఆకలితో ఉన్న జంతువుకు, దాని పిల్లలకు ఆహారం పెట్టి వాటి ప్రాణాలను కాపాడారు. నాకు ఆ పుణ్యం కావాలి.” ఆ పుణ్యాన్ని అమ్మడానికి వ్యాపారవేత్త అంగీకరించాడు.
వర్తకుడు ఇలా అన్నాడు—“ఈ పుణ్యానికి బదులుగా, నాలుగు రొట్టెల బరువుకు సమానమైన వజ్రాలు, ముత్యాలు నీకు ఇస్తాను.” నాలుగు రొట్టెలను తయారు చేసి త్రాసు యొక్క ఒక వైపున ఉంచారు. మరో వైపున, వజ్రాలు, ఆభరణాలతో నిండిన ఒక పెట్టెను ఉంచారు. కానీ త్రాసు కదలలేదు!
మరొక పెట్టెను తెచ్చి పెట్టారు. అయినా, త్రాసు కదలలేదు. ఇన్ని వజ్రాలు, ఆభరణాల ప్యాకేజీలు పెట్టిన తర్వాత కూడా ఆ నాలుగు రొట్టెలు బరువుగానే ఉన్నాయి.
ఆ వ్యాపారి ఇలా అన్నాడు—“అయ్యా, నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పవిత్రతను అమ్ముకోను.” అతను ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వెళ్ళాక తన భార్యతో గొడవ పడతానేమోనని అతనికి భయం వేసింది. అతను కుక్కకు రొట్టె ఇచ్చిన చోటు నుండి కొన్ని గులకరాళ్ళు, రాళ్ళు ఏరుకుని తన సంచిలో పెట్టుకున్నాడు.
ఇంటికి చేరుకున్నాక, అతని భార్య “సద్గుణాన్ని అమ్మి ఎంత డబ్బు సంపాదించావు?” అని అడిగింది. ఆ వర్తకుడు ఆమెకు సంచిని చూపించి, “రాత్రి భోజనం చేశాక దాన్ని తెరుస్తాను” అని చెప్పాడు.
కానీ అతని భార్యకు సహనం నశించింది. ఆమె భర్త ఊరి నుండి డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు, ఆమె ఆ సంచిని తెరిచింది. సంచి తెరవగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి! ఆ సంచి నిండా వజ్రాలు, ఆభరణాలు ఉన్నాయి.
భర్త ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, భార్య అడిగింది—“మీ పవిత్రతకు ఇంత మంచి మూల్యం ఎవరు చెల్లించారు? ఈ వజ్రాలు, ఆభరణాలు అన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?”
బహుశా తన భార్యకు అంతా తెలుసేమోనని, ఆమె తనను ఎగతాళి చేస్తోందేమోనని ఆ వ్యాపారవేత్త భావించాడు. కానీ తన భార్య ముఖంలోని ఆనందాన్ని చూసి, అసలు విషయం వేరే అని అతను అర్థం చేసుకున్నాడు.
అతను అడిగాడు—“చూడండి, వజ్రాలు, ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి?” భార్య ఆ మూటను తీసుకువచ్చి అతని ముందు తెరిచింది. దానిలో నుండి ఒక అమూల్యమైన రత్నం బయటకు వచ్చింది. వర్తకుడు ఆశ్చర్యపోయాడు.
అప్పుడు అతను తన భార్యకు అంతా చెప్పాడు. ఆ భార్య తన తప్పుకు పశ్చాత్తాపపడింది—అవసరమైన సమయంలో తన భర్తను తన పవిత్రతను అమ్ముకునేలా తను బలవంతం చేసింది. ఇద్దరూ కలిసి, ఈ ఆస్తిలో కొంత భాగంతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి, దాని నుండి వచ్చే డబ్బును ప్రజా సేవ మరియు సంక్షేమం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.






