శుక్రవారం, డిసెంబర్ 26, 2025

పగ కోసమే బతికిన కుర్రాడు



అది 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ ..... అక్కడ ఓ చిన్నతోటలో  .... రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు.

> ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది.  
దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..

ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక 
* అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. 

నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు.. శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు. 

దీనికి కారకుడైన  జనరల్ ఓ డయ్యర్ ను వెతుకుంటూ బయలు దేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. 
* కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నాడు..

జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయన మవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేశారు. తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..

1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయన మైనాడు. పేరు మార్చుకుంటూ 
జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడ సాగాడు.. 
దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.

ఆరోజు 1940 జూలై 13....
ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. 
ఆ సమాచారం  ఆయువకునికి అందింది...  వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్  సంపాదించాడు ..  

ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో  ఫిస్టల్  దాచాడు.. అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు... 

సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు, 
ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు...

> అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలాబాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..

రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు.. కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించ నీయకుండా గంభీరంగా ఉన్నాడు...

ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది...
ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. 

ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు...

నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ  అప్రమత్తమయ్యేందుకు లేచాడు. 

* అంతే ఆయువకుడు  పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు.. 

భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు....

వేలమందిని చంపి భారతీయులు  నా బానిసలు.. వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో... 
ఆతను జనరల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు. 

ఓ డయ్యర్ ను చంపిన తరువాత 
ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను. ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగి పోయాడాయువకుడు...

ఆ విప్లవవీరుడి జయంతి నేడు.

ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా???? 
షంషేర్ ఉద్దామ్ సింగ్ ....డిసెంబర్ 26 స్వాతంత్ర్య సమరయెాధుడు జయంతి...

"జోహార్ ఉద్దాం సింగ్ ... జోహార్ "

బుధవారం, డిసెంబర్ 24, 2025

ముచ్చెమటలు పట్టించిన ముసలి రైతు

 

 


1979... ఉత్తరప్రదేశ్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్సైతో పోటు పోలీసు సిబ్బంది మొత్తం పిచ్చాపాటి  మాట్లాడుకుంటున్నారు...

. ఇంతలో తలపాగ, దుస్తులంతా బురద కొట్టుకొని వున్న ఒక ముసలిరైతు స్టేషన్ లోనికి వచ్చాడు. అతని వైపు ఎగాదిగా చూసిన సిబ్బంది ఏం కావాలంటూ నిర్లక్ష్యంగా అడిగారు. తన పశువులు కనిపించడం లేదనీ, వాటిని వెతికిపెట్టమనీ అడిగాడా ముసలిరైతు.అతని వంక అసహ్యంగా చూస్తూ..వచ్చేస్తాయిలే పో అని అన్నారు వాళ్ళు. అయినా రిపోర్టు రాసుకోండని రైటర్ ను అడిగాడా రైతు. నిర్లక్ష్యంగా చూస్తూ తెల్లకాగితం అతని వైపు తోచాడు రైటర్. మళ్ళీ ఓహో నీకు రాయడం రాదుకదా! అంటూ హేళనగా మాట్లాడుతూ ఏదో రిపోర్టు రాసి, ఈక్రింద వేలిముద్రవేయమని స్టాంప్ పాడ్ ఇచ్చాడు రైతుకు. అందుకు రైతు నేను సంతకం చేయగలను.పెన్ ఇవ్వండి అన్నాడు. అది విని రైటర్ బిగ్గరగా నవ్వుతూ "నువ్వు పెన్ ఎప్పుడైనా చూసావా? ఇదిగో సంతకంపెట్టు అన్నాడు. పెన్ తీసుకొని రైటర్ చెప్పిన చోట సంతకంచేసి ఇచ్చాడు రైతు.

ఆ సంతకం చూసిన ఆ రైటర్ దిగ్గునలేచి ఆ ముసలి రైతుకు సల్యూట్ కొట్టాడు. అది చూసిన మిగతావారు కంగారుగా వచ్చి సంతకం ను పరిశీలించి సల్యూట్ చేసి వినయంగా నిలబడ్డారు. ఇంతకీ ఆ సంతకం లో ఏమివుందో తెలుసా?? "చౌదరీ చరణ్ సింగ్ .పియం ఆఫ్ ఇండియా" అని.

పోలీసుల నిర్లక్ష్యానికి ప్రతిగా పోలీసుస్టేషన్ లోని సిబ్బందినంతా సస్పెండ్ చేశారు చరణ్ సింగ్ గారు. అలా చేసిన మొదటి ప్రధాని ఆయనే!!!ఆయన పోరాటం వల్లే జమీందారీ వ్యవస్థ రద్దు అయింది, రైతులకు సబ్సడీ రుణాలు వచ్చాయి.. కౌలు రైతు చట్టం వచ్చింది.

చౌదరి #చరణ్_సింగ్ గారు (1902 డిసెంబరు 23 - 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించారు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తించారు.

చరణ్ సింగ్ సోవియట్-శైలి ఆర్థిక సంస్కరణల పై జవహర్ లాల్ నెహ్రూను వ్యతిరేకించారు. అతను 1947 తరువాత ఉత్తర భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సహాయం చేశారు. భారతదేశంలో సహకార సేద్యం విజయవంతం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక రైతు కుమారునిగా, ఒక రైతుకు సరైన యాజమాన్య హక్కు అతను వ్యవసాయదారునిగా ఉండడమేనని అభిప్రాయపడ్డారు. అతను రైతు యాజమాన్య వ్యవస్థను సంరక్షించి స్థిరీకరించాలని కోరుకున్నారు.  నెహ్రూ ఆర్థిక విధానం గురించి బహిరంగ విమర్శలు చేసిన కారణంగా చరణ్ సింగ్ రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారింది.

రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అతని జన్మదినం డిసెంబరు 23 న కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం) గా జరుపుకుంటారు.

- (హిందూ ధర్మచక్రం) 

ఆదివారం, డిసెంబర్ 21, 2025

వెంకన్న వెట్టి చేసిన తిరుమల నంబి





 తిరుమల మాడవీథుల్లో వెడుతుంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమలనంబి దేవాలయం ఉంటుంది. 

* ఎవరీ తిరుమలనంబి? ఈయనకు దేవాలయం ఏమిటి? పూర్వం శ్రీరంగంలో యామునాచార్యులవారు శిష్యులందర్నీ కూర్చోబెట్టుకుని ‘బ్రాహ్మీ ముహూర్తంలో  వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి కావలసిన జలాలను తీసుకు రావడానికి వేంకటాచలం మీద ఎవరయినా ఉండగలరా?’ అని అడిగితే తిరుమలనంబి దానికి సిద్ధపడ్డాడు. ఆయనను శ్రీశైలపూర్ణులు అని కూడా అంటారు. ఆయన రోజూ పాపనాశనానికి వెళ్ళి నీళ్ళు కుండతో తలమీద పెట్టుకుని మోసుకుంటూ గోవింద నామ స్మరణ చేస్తూ అభిషేకానికి తీసుకువస్తుండేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. వేంకటేశ్వరస్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి ‘తాతా, తాతా! దాహం వేస్తోంది.నీళ్ళు పొయ్యవా? అని అడుగుతాడు. ‘ఇవి స్వామివారికి అభిషేకానికి తీసుకువెడుతున్నా...తప్పుకో’’ అంటూ ముందుకు సాగిపోతుంటే... బాలకిరాతుడు వెనకనుంచి బాణం వేసి కుండకు చిల్లు కొట్టి నీళ్ళు తాగుతాడు. కుండ బరువు తగ్గడం గమనించిన తిరుమలనంబి వెనక్కి తిరిగి చూసేసరికి కుండనుంచి ధారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసిపట్టి తాగుతున్నాడు. ‘‘ఎంత దుర్మార్గపు పని చేసావురా, తాగొద్దంటే అవి తాగావా?...’’అని నిందించబోతుంటే... వెంటనే ఆ బాలుడు ‘‘తాతా! బెంగపడొద్దు. నీళ్ళకు పాపనాశనందాకా వెళ్ళడమెందుకు? ఇక్కడే ఉంది, ధార నీకు చూపిస్తాను, రా...అంటూ ఆ కొండలలోకి బాణం వేసి కొట్టాడు. ఆకాశగంగ అలా వచ్చింది. ఆలయంలో స్వామి అర్చకులమీద ఆవహించి ‘‘అభిషేకానికి ఈవేళ నుంచి పాపనాశనం నీళ్ళు అక్కరలేదు. ఆకాశగంగ నీళ్ళతో చెయ్యండి.’’

అని పురమాయించారు. ఇప్పుడు తిరుమలనంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పర్ణశాల ఉండేది. అక్కడ అనుష్ఠానం చేసుకుని స్వామివారి అభిషేకానికి పాపానాశనం నుంచి రోజూ తెల్లవారుఝూమునే చాలా సంవత్సరాలపాటు నీళ్ళు మోసుకొచ్చారు. అలా ఆయన్ని ఆప్యాయంగా తాతా! అని పిలుస్తూ ఆయన్ని తరింపచేసావా, ఎంత సులభసాధ్యుడవయ్యా తండ్రీ అని చెప్పడానికి....‘‘అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారు వారికి/ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు/మచ్చిక దొలక తిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చమాటలాడి నోచినవాడు/’’ అనీ అన్నమాచార్యులవారు కీర్తన చేసారు. మరి ఈ అనంతాచార్యులవారెవరు? ఈయన కొండమీద స్వామివారికి పూలుగుచ్చి దండలు సిద్ధం చేసేవారు. ఈయన ఒకరోజున తనపనిలో నిమగ్నమై ఉండగా రమ్మనమని స్వామివారు కబురు పంపారట.

దానికి ఆచార్యులవారు ‘‘ఆయనకు వేరేపని ఏముంది కనుక, హాయిగా పీఠమెక్కి కూచుంటాడు. కబుర్లకోసం నాకు రావడం కుదరదు’ అని చెప్పిపంపి సాయంత్రం ఆ దండలన్నింటినీ గౌరవంగా ఒక బుట్టలో పెట్టుకుని వెళ్ళాడు. ‘‘నేను రమ్మంటే రానప్పుడు, నీ పూలదండలు నాకెందుకు, అక్కరలేదు ఫో!’’ అని స్వామివారు కసురు కున్నారట. దానికి అనంతాచార్యులవారు ‘నీవెవరు నన్నుపొమ్మనడానికి. నీదా ఈ కొండ? వరాహ స్వామిదగ్గర నీవు ఎలా పుచ్చుకుని వచ్చావో, అలా మా గురువుగారు వెళ్ళమంటే నేను వచ్చా. గురువుగారు దండలిమ్మన్నారు. వచ్చి ఇస్తుంటా. పుచ్చుకుంటే పుచ్చుకో. లేదంటే ఊరుకో. ఇక్కడ ఈ తలుపు కొయ్యకు తగిలించి పోతున్నా. నీ ఇష్టం. నేను మాత్రం నా పని వదిలి కబుర్లకు రాను’’ అని చెప్పి వెళ్ళిపోతుంటే స్వామివారే వెంటపడి ఆయనను బుజ్జగించి వెనక్కి తీసుకొచ్చారట. అంత పిచ్చి భక్తి చూపిన అనంతాళ్వారు వారికి వెట్టిచేసావా స్వామీ’’ అని అన్నమయ్య అంటున్నారు.

(హిందూ ధర్మచక్రం)

నాట్య రంజని, నృత్యభామిని, విశ్వమోహిని


 


(యామినీ_కృష్ణమూర్తి గారి జన్మదినం సందర్భంగా...)

యామినీ కృష్ణమూర్తి (1940 డిసెంబరు 20) ప్రముఖ నర్తకి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ  నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టింది. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించింది. ఈమె తండి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. అటుపై వాళ్ల కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ, విదేశాల్లో పేరు పొందినది.

ఈమె పూర్తి పేరు యామినీ పూర్ణతిలకం. తన తండ్రి ప్రోత్సాహంతో తన 5వ ఏట చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరత నాట్యము నేర్చుకోవడము ప్రారంభించింది. భరత నాట్యంలో ఈమె గురువులు కాంచీపురం ఎల్లప్ప పిళ్ళై, చొక్కలింగం పిళ్లై, బాలసరస్వతి, తంజావూర్ కిట్టప్ప, దండాయుధపాణి, మైలాపూర్ గౌరి అమ్మ మొదలైనవారు. ఈమె వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ వంటి వారి వద్ద కూచిపూడి నేర్చింది. పంకజ చరణ్‌దాస్, కేలూచరణ్ మహాపాత్రల వద్ద ఒడిస్సీ నేర్చుకొన్నది. ఎం.డి.రామనాథన్ దగ్గర కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకొంది. ఈమె తన తొలిప్రదర్శనను తన 17వ యేట చెన్నైలో 1957వ సంవత్సరంలో ఇచ్చింది. ఈమెకు 20సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఈమె ఒక ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు పొందింది. ఆ క్రమంలో ఈమె తన మకామును ఢిల్లీకి మార్చింది.

నాట్య ప్రస్థానం, గుర్తింపు
వివిధ రకాల నృత్యాలను హేమాహేమీలైన గురువుల వద్ద ఎంత నేర్చుకున్నా, ఈమె తన కళతో ప్రేక్షకులను నిలవేసి "ఇది నా ఒరవడి" అని చాటే ఒకానొక విశిష్ట బాణీ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈమె ఏ బాణీ నృత్యం చేసినా వివిధ నృత్య రీతులను కలగాపులగం చేయకుండా ఆయా నృత్య సంప్రదాయాల పరిధిలోనే తన వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నర్తనానికి ఖ్యాతి రావడానికి చాలా కాలం ముందే ఈమె అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా ఇత్యాది ఎన్నోదేశాలు పర్యటించి ఆయా చోట్ల నృత్య ప్రదర్శనలిచ్చి, భారతీయ నాట్య ప్రచారం చేయడం జరిగింది. ఢిల్లీలో నృత్యకౌస్తుభ కల్చరల్ సోసైటి - యామిని స్కూల్‌ ఆఫ్‌ డాన్స్‌ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నది. ఈమె తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకి."క్షీరసాగరమధన"మనే నృత్యరూపకాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆకాశవాణి కోసం రచించాడు. కాని దాన్ని కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో ప్రసిద్ధ, నాట్యాచార్యుడు - చింతా కృష్ణమూర్తి ప్రిన్సిపల్‌గా ఉన్న రోజుల్లో అక్కడ ప్రదర్శించ తలపెట్టి ఈ రూపకానికి నృత్యం కూర్చవలసిందిగా ప్రఖ్యాత నర్తకుడు, నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంకు అప్పగించాడు. అప్పుడు ఆయన నేతృత్వంలో మొట్టమొదట ప్రదర్శించిన "క్షీరసాగరమథనం"లో యామినీ కృష్ణమూర్తి "విశ్వమోహిని" పాత్రలో, ధన్వంతరి, మహావిష్ణువు పాత్రల్లో వేదాంతం సత్యనారాయణ శర్మ నటించి ఈ ప్రదర్శనను రక్తి కట్టించారు. ఆనాటి నుండి ప్రజలు ఈమెను "విశ్వమోహిని" అని సంబోధించడం మొదలు పెట్టారు. తరువాత ఈమె ఈ క్షీరసాగరమథనం నృత్యనాటికను అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ముందు ప్రదర్శించి అతని నుండి భామావేణీ బిరుదును అందుకున్నది. అంతే కాక ఈమె "భామాకలాపం"లో సత్యభామగా అవతరించే వైఖరి, "మండూక శబ్దం"లో కృష్ణదేవరాయల ప్రశస్తిని లీలగా చూపే అభినయం, భంగిమల్లోని ఠీవి, ఔచిత్యం, "సింహాసనస్థితే" శ్లోకంలో దేవిని కళ్ళకు కట్టిస్తూ పట్టే భంగిమలు, "కృష్ణశబ్దం"లో భావతీవ్రత, లాలిత్యం, వైవిధ్యం ఈమె ప్రతిభకు తార్కాణాలు. వేదాలకు కొన్ని పసందైన జతులతో ఈమె కూర్చిన నృత్యం ఈమె పాండిత్యానికి ఉదాహరణ. 

యామిని సేవలను గుర్తించిన ప్రభుత్వం 1968లో పద్మశ్రీ 2001లో పద్మభూషణ్‌ 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్‌ ఆఫ్‌ డాన్స్‌ సంస్థ యామినికి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. ఆపై యామిని కూచిపూడి నృత్యానికి సంబంధించి డీవీడీలు విడుదల చేసింది. తన నృత్యప్రస్థానాన్ని "రేణుకా ఖాండేకర్" సహకారంతో "ఎ ప్యాషన్ ఆఫ్ డాన్స్" పేరుతో పుస్తకంగా రాసింది. నృత్యకళ పట్ల జనసామాన్యంలో అవగాహన కలిగించడానికి అభిరుచి పెంచడానికి సుమారు మూడేండ్ల పాటు పరిశోధన చేసి "నృత్యమూర్తి" సీరియల్‌ను పదమూడు భాగాలుగా ఈమె రూపొందించి దూరదర్శన్‌లో ప్రసారం చేసింది. మన సంస్కృతీ వైభవానికి గోపురమై నర్తనశిల్పాల ఆధారంగా, స్థలపురాణాలు, చరిత్ర జోడించి వ్యాఘ్రపాద, పతంజలి సూక్తులు, కర్ణాటక సంగీతం రుచిచూపిస్తూ ఈ సీరియల్‌లో నృత్య సర్వస్వాన్ని ఇమిడ్చి చూపించింది.2017లో విశాఖపట్నంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు ఈమెకు స్వర్ణకమలం బహూకరించి "నాట్య విద్యాభారతి" అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. న్యూఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు ఈమె డైరెక్టరుగా సేవలను అందించింది. ఈమె వివాహం చేసుకోకుండా అవివాహితగానే వుండి నాట్యరంగానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేసింది.

అవార్డులు 
పద్మశ్రీ (1968)
సంగీతనాటక అకాడమీ అవార్డు (1977)
పద్మభూషణ్ (2001)
పద్మవిభూషణ్ (2016)

ఫిలింస్ డివిజన్ ఆఫ్ ఇండియా 1971లో ఏల్చూరి విజయరాఘవ రావు సంగీత దర్శకత్వంలో "యామినీ కృష్ణమూర్తి" పై 20 నిమిషాల ఒక డాక్యుమెంటరీ సినిమా తీసింది. ఈమె ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలో వెలువడిన చందనీర్ అనే బెంగాలీ సినిమాలో తన పాత్రలోనే (డా.యామినీ కృష్ణమూర్తి) నటించింది.

-(హిందూ ధర్మ చక్రం)

సోమవారం, డిసెంబర్ 15, 2025

అలనాటి నగరాలు... ఇప్పుడెక్కడ?


 

61 ప్రాచీన నగరాలు, నదీ ప్రాంతాలు, రాజ్యాలు మరియు వాటి ప్రస్తుత  ప్రాంతాలు ఈ చిత్రం ఆధారంగా:

1. Hastinapura - హస్తినాపురం (ఉత్తరప్రదేశ్)

2. Kashi - వారణాసి (ఉత్తరప్రదేశ్)

3. Kosala - అవధ్ ప్రాంతం (ఉత్తరప్రదేశ్)

4. Videha - మిథిలా (బీహార్)

5. Magadha - పాటలిపుత్రం ప్రాంతం (పట్నా, బీహార్)

6. Anga - భాగల్‌పూర్ (బీహార్)

7. Vanga - పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్

8. Pundra - పూర్వ బంగాల్ (బంగ్లాదేశ్)

9. Kuru - ఢిల్లీ, హర్యానా

10. Panchala (East, North, South, West) - వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్

11. Surasena - మథుర (ఉత్తరప్రదేశ్)

12. Matsya - జైపూర్ (రాజస్థాన్)

13. Avanti - ఉజ్జయిని (మధ్యప్రదేశ్)

14. Chedi - జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)

15. Vidarbha - విదర్భ (మహారాష్ట్ర)

16. Kalinga - ఒడిశా

17. Utkala - ఉత్తర ఒడిశా

18. Andhra - ఆంధ్రప్రదేశ్

19. Dravida - దక్షిణ తమిళనాడు

20. Pandya - మధుర (తమిళనాడు)

21. Chola - తంజావూరు (తమిళనాడు)

22. Kanchipura - కాంచీపురం (తమిళనాడు)

23. Mahishaka - మైసూరు (కర్ణాటక)

24. Mushika - ఉత్తర కేరళ

25. Kerala - కేరళ

26. Karnataka - కర్ణాటక

27. Kishkindha - హంపీ ప్రాంతం (కర్ణాటక)

28. Saurashtra - గుజరాత్

29. Anarta - ఉత్తర గుజరాత్

30. Dwarka - ద్వారకా (గుజరాత్)

31. Gandhara - పెషావర్ (పాకిస్తాన్)

32. Kamboja - ఆఫ్ఘానిస్తాన్

33. Tushara - తుర్క్‌మెనిస్తాన్

34. Huna - హున్స్ (మధ్య ఆసియా)

35. Parama Kamboja - ఉత్తర ఆఫ్ఘానిస్తాన్/తజికిస్తాన్

36. Uttara Kuru - హిమాలయాల ఉత్తరం (మిథిలా పురాణ ప్రకారం అరుణాచలం ప్రాంతం)

37. Uttara Madra - ఉత్తర పాకిస్తాన్ (స్వాత్, హజారా)

38. China - చైనా

39. Nepal - నేపాల్

40. Kirat - తూర్పు నేపాల్ & సిక్కిం

41. Lauhitya - బ్రహ్మపుత్రా ఉపనది ప్రాంతం (అసోం)

42. Pragjyotisha - గౌహతి (అసోం)

43. Suhma - పశ్చిమ బెంగాల్ (బర్ధమాన్ ప్రాంతం)

44. Vanga - దక్షిణ బెంగాల్ (కోల్‌కతా ప్రాంతం)

45. Ganga - గంగానది పరిసర ప్రాంతాలు

46. Yamuna - యమునా నది పరిసర ప్రాంతాలు

47. Sarasvati - ప్రాచీన సరస్వతి నది (ప్రస్తుత పంజాబ్/హర్యానా).

48. Godavari - గోదావరి నది పరిసర ప్రాంతం (మహారాష్ట్ర, తెలంగాణ).

49. Krishna - కృష్ణా నది పరిసర ప్రాంతం (ఆంధ్రప్రదేశ్)

50. Narmada - నర్మదా నది ప్రాంతం (మధ్యప్రదేశ్)

51. Tapati - తప్తి నది (మహారాష్ట్ర/గుజరాత్)

52. Sarayu - శరయు నది (ఉత్తరప్రదేశ్)

53. Vaitarani - ఒడిశా లోని వైతరిణి నది

54. Dandaka Forests - దండకారణ్యం (మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలు)

55. Riksha - మధ్యభారత హరద్-బతూళా ప్రాంతం

56. Swarnamukhi - ఆంధ్రప్రదేశ్ లోని స్వర్ణముఖి నది

57. Mahendra - మల్కాన్‌గిరి, ఒడిశా లోని మహేంద్రగిరి పర్వతం.

58. Malaya - దక్షిణ పర్వతాలు (నీలగిరి, పాళణి హిల్స్)

59. Sahya - పశ్చిమ కనుమలు (Western Ghats)

60. Vindhya - వింధ్య పర్వతాలు (మధ్య భారతదేశం)

61. Malayavat - దక్షిణ పర్వతాలు (కేరళ, తమిళనాడు లోని కొండ ప్రాంతాలు).


పహారాలో పరమ సత్యాలు !


పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు.ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొనిపోవడానికి నిశ్చయించుకొన్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, “గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు. వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులను, “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు. అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని 'మాలవాడ' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు. ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతూన్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. 

పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూ పనికిరాని అప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతనలేక కాలం గడపసాగాడు.ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది! రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని  ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు.  రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:

“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః

జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః." 

మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.  మళ్ళా రెండవ ఝాము వచ్చింది.

 అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: 

“జన్మదుఃఖం జరాదుఃఖం -

జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”

పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:

“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః

అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”

తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు, 

“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 

ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”

అని చాటింపు వేశాడు.

ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త  జాగ్రత్త - అని చాటాడు.ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.  కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు,  “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష  విధిస్తారు?” అని అడిగాడు.  అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. “అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.  నా చేతులమీద, నా కత్తితో  వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు. “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! 

కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే: మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు. ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని  ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో  నమస్కరించాడు."వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని  అడిగాడు.

 అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు 'మాలపల్లె' అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా! కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.” అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం.


అత్తవారింట్లో అల్లుడికి శిక్ష !




పూర్వము భారవి అనే సంస్కృత  కవి వుండేవాడు. ‘కిరాతార్జునీయం’ సహా ఆరు మహాకావ్యాలను రచించిన  ఇతడు ఆరో శతాబ్దానికి చెందిన వాడు. ఇతడి గురించిన ఆసక్తికరమైన కథ  ఒకటుంది. 

భారవి చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.

భారవి తండ్రితో ‘నీకొడుకు చాలా బాగా రాస్తున్నాడయ్యా!’ అనేవారు.

ఆయన మాత్రం ‘వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో రాస్తాడులే!’ అని తేలిగ్గా అనేవాడు.

భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి ఉండేది. 

తల్లి దగ్గర ‘నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడతారు. ఊళ్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే  చులకనగా... ఆ.. ఏమున్నది, యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడతారు.’ అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు.

ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.

భారవి, అన్నం తిన్నాక పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.

అప్పుడు భారవి తల్లి భర్తతో…   ‘మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు? వాడు చాలా బాధ పడుతున్నాడు. వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!’

అప్పుడు తండ్రి నవ్వి.... ‘పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాటి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా?’ అన్నాడు.

అంతా విన్న భారవికి బుర్ర తిరిగి పోయింది.

పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి ‘నాకేదయినా శిక్ష వేయమ’ని బ్రతిమాలుకున్నాడు.

’పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు?’ అని తండ్రి చెప్తున్నా వినకుండా  తనకు ‘శిక్ష వేయమ’ని పట్టు బట్టాడు.

తండ్రి ‘సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఉండిరా. నువ్వెందుకు ఉన్నావో ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా  ఏ కారణాలు చెప్పకుండా ఉండాలి’ అన్నాడు.

‘ఇదేం శిక్ష? ’ అన్నాడు భారవి.

తండ్రి నవ్వి ‘అది చాల్లే వెళ్ళు!’ అన్నాడు.

భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు.

సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

రోజుకో పిండివంట చేసి ఆదరించారు. నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.

చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు...

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.

అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ ‘మీరు మీ ఊరు వెళ్లిపోండ’ని  యెంతో చెప్పి చూసింది.

భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు.

ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి ‘యింక నేను  మావూరికి పోయివస్తాన’ని బయల్దేరాడు.

ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.

భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి ‘నాశిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను!’ అని చెప్పాడు.

ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.

కోపంగా మాట్లాడే ప్రతివారి ని శతృత్వముతో చూడరాదు.

చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!

అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

తల్లిదండ్రులను ద్వేషించకండి!

అంతకంటే పాపం ఇంకోటి వుండదు!


శనివారం, డిసెంబర్ 13, 2025

కమనీయం... కాశీ వైభవం


 

కాశీ వైభవాన్ని పూర్తిగా తెలుసుకుందాం 

 దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం...

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. 

విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న 

ప్రత్యేక స్థలం.

ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. 

ప్రపంచ సాంస్కృతిక నగరం.

స్వయంగా శివుడు నివాసముండె నగరం.

ప్రళయ కాలంలో మునగని అతి  ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, 

కాలభైరవ దర్శనము 

అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...

కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశీలోని కొన్ని వింతలు.

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. 

అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి, అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు 

అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు, కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి... ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి 

ఎన్నోవున్నాయి. 

అందులో కొన్ని.....

1) దశాశ్వమేధ ఘాట్...

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్...

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్...

చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్...

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్...

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్...

ఇది కాశీలో మొట్ట మొదటిది. 

దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో  తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు.

ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. 

ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్...

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. 

ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

😎 పంచ గంగా ఘాట్...

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్...

గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్...

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్...

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్...

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్...

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్...

ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్.. 

నారదుడు లింగం స్థాపించాడు.

16) చౌతస్సి ఘాట్...

ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 

64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... 

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 

64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్...

ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18) అహిల్యా బాయి ఘాట్...

ఈమె కారణంగానే మనం ఈరోజు 

కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. 

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ  మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. 

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, 

మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

🈸కాశీ స్మరణం మోక్షకారకం... 🈸


గురువారం, డిసెంబర్ 11, 2025

వందేమాతరం పూర్తి గేయం





 

🌹🌾వందే మాతరం🌾🌹

🇮🇳వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం ॥వందే॥

🇮🇳శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥

🇮🇳కోటికోటి కంఠ కలకల నినాదకరాలే
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరామ్ ॥ వందే ॥

🇮🇳తిమి విద్యా తిమి ధర్మ తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే ॥ వందే ॥

🇮🇳త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ ॥ వందే ॥

🇮🇳శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం

బుధవారం, డిసెంబర్ 10, 2025

మీ గోత్రం... మీ వారసత్వానికి డీఎన్ఏ

 


 

 

🫠ప్రతి ఒక్కరూ చదవండి అర్థం చేసుకోండి రాబోయే తరాలకి అందించండి

🌹🧘మీ గోత్రం యొక్క నిజమైన శక్తిని మీకు తెలుసా?

🪷🪷🧘‍♀️🧘🪷🪷

🚩🚩🌾ఇది ఒక ఆచారం కాదు. మూఢనమ్మకం కాదు. ఇది మీ ప్రాచీన కోడ్🌾🚩🚩

🚩🌾ఈ థ్రెడ్‌ను పూర్తిగా చదవండి… ఇది మీ గతాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అవసరం.
1.🚩 గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు. ఇది మీ ఆత్మిక DNA.

అవును, చాలా మందికి తమ గోత్రం కూడా తెలియదు.
పూజలో పండితుడు ఏదో చెబుతాడు అని అనుకుంటాం. కానీ ఇది అంత తేలిక కాదు.

🍁🌾మీ గోత్రం అంటే - మీరు ఏ ఋషి యొక్క మనస్సుకు, ఆలోచనలకు, శక్తికి, జ్ఞానానికి అనుసంధానమయ్యారు అన్నదే.

ప్రతి హిందువును ఒక ఋషి వరకు ఆధ్యాత్మికంగా అనుసంధానించవచ్చు.

ఆ ఋషి మీ రక్త సంబంధి కాకపోయినా, ఆత్మ సంబంధి.

2. గోత్రం అనేది కులం కాదు.

ఇప్పటి కాలంలో ఇది ఎక్కువగా గందరగోళంగా మారింది.

గోత్రం అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్రుడు అన్న భావన తప్పు భావన.

గోత్ర వ్యవస్థ కులాలకు ముందే ఉంది. ఇది ఒక విద్యాపరమైన గుర్తింపు.
ఋషులు తమ విద్యార్ధులకు గోత్రం ఇచ్చేవారు – అది విద్య ద్వారా సంపాదించేది.

అందువల్ల, గోత్రం అనేది శక్తి గుర్తింపు కాదు – జ్ఞానం గుర్తింపు.

3. ప్రతి గోత్రం ఒక మహాఋషి నుండి వస్తుంది

మీరు వశిష్ఠ గోత్రానికి చెందినవారై ఉంటే – మీరు వశిష్ఠ మహర్షి మానసిక వారసత్వాన్ని కలిగి ఉన్నవారు.
ఆయన రాముడి గురువు, దశరథుడి సలహాదారు కూడా.

భరద్వాజ గోత్రం అంటే – వేదాల రచనలో భాగం, యుద్ధ విద్యలో నిపుణులైన ఋషి వారసత్వం.

🍁🌾మొత్తం 49 ప్రధాన గోత్రాలు ఉన్నాయి – ప్రతి గోత్రం ఒక విశిష్ట రంగంలో నిపుణులైన ఋషికి సంబంధించినది.

4. ఎందుకు పెద్దలు ఒకే గోత్రం మధ్య వివాహాన్ని నిషేధించారు?

🚩🌾ఇది జనరల్ స్కూల్లో చెప్పే విషయం కాదు.

గోత్రం వంశ పరంపరలో పురుషుల ద్వారా వెళ్తుంది.
అంటే, ఇద్దరూ ఒకే గోత్రానికి చెందినవారైతే, వారు జన్యుపరంగా దగ్గర బంధువులే.
దీని వల్ల పిల్లల్లో శారీరక, మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది.

గోత్ర వ్యవస్థ = ప్రాచీన భారతీయ జన్యుపరమైన విజ్ఞాన శాస్త్రం.

 


 

5. గోత్రం = మీ మానసిక ప్రోగ్రామింగ్

కొంతమంది జన్మతః తత్త్వవేత్తలు. కొంతమందికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ.
కొంతమంది సహజంగా ధైర్యవంతులు. ఇదంతా ఎందుకు?

మీ గోత్ర ఋషి యొక్క మానసిక ఫ్రీక్వెన్సీ ఇంకా మీలో పనిచేస్తోంది.
ఋషి యోధుడైతే, మీలో ధైర్యం ఉంటుంది.
ఔషధ ఋషి అయితే, ఆయుర్వేదం అంటే మక్కువ ఉంటుంది..

6. విద్యను కూడా గోత్రాన్ని బట్టి తీసుకునే వారు

ప్రాచీన గురుకులాల్లో విద్యార్ధికి మొదటి ప్రశ్నే: "బేటా, నీ గోత్రం ఏంటి?"

ఎందుకంటే అది విద్యార్ధి నేర్చుకునే శైలిని, ఇతని బలాల్ని తెలిపేది.
అత్రి గోత్రం వారు ధ్యానం, మంత్రాల్లో శ్రేష్ఠత పొందేవారు.
కశ్యప గోత్రం వారు ఔషధ విజ్ఞానంలో.

7. బ్రిటిష్ తక్కువగా చూశారు. బాలీవుడ్ నవ్వించింది. మనం మర్చిపోయాం.

బ్రిటిష్‌లు వచ్చాక గోత్రం వ్యవస్థను అర్థం చేయక పోయారు.
దాన్ని మూఢనమ్మకం అని పేర్కొన్నారు.
బాలీవుడ్ దాన్ని సరదాగా తీసుకుంది.
ఇలా మనం పిల్లలకు చెప్పడం మానేశాం. 10,000 సంవత్సరాల వ్యవస్థ 100 ఏళ్లలో కరిగిపోతుంది.

8. మీ గోత్రం తెలియకపోతే – మీరు ఆత్మిక మ్యాప్‌ను కోల్పోతారు

ఇది మీ ఆధ్యాత్మిక GPS.
– సరైన మంత్రం
– సరైన పూజా విధానం
– సరైన ధ్యానం
– సరైన వివాహం
– సరైన ఆధ్యాత్మిక మార్గం

ఇవి అన్నీ గోత్రం ఆధారంగా తెలుసుకోవచ్చును.

9. పూజలో గోత్రం చెబుతారు అంటే – అది ఒక శక్తివంతమైన కాల్.

పూజ ప్రారంభంలో “సంకల్పం”లో మీ గోత్రాన్ని చెప్పడం వల్ల
మీ ఋషి యొక్క ఆత్మశక్తి పూజలో చేరుతుంది.
అదే వాక్యం: “భరద్వాజ గోత్రాన్విత శ్రీనివాసుడిగా నేను ఈ పూజను శ్రద్ధతో చేయుచున్నాను.”

10. ఆలస్యం కాకమునుపే మీ గోత్రాన్ని పునరుద్ధరించండి

– తల్లిదండ్రులను అడగండి
– తాతమామల వద్ద తెలుసుకోండి
– రీసెర్చ్ చేయండి
– మీ పిల్లలకు చెప్పండి
– గర్వంగా ఉంచండి

🚩🌾మీరు పుట్టింది 1990లో కావచ్చు. కానీ మీలో ప్రవహిస్తున్న జ్ఞానం కృతయుగం నాటి ఋషులది.

11. గోత్రం = మీ ఆత్మకు పాస్‌వర్డ్

మనం Wi-Fi పాస్‌వర్డ్లు గుర్తుపెట్టుకుంటాం.
కానీ మన ఆత్మ పాస్‌వర్డ్ అయిన గోత్రాన్ని మర్చిపోతాం.

మీ మనశ్శక్తి, కర్మ, జ్ఞానం – ఇవన్నీ గోత్రంతో అనుసంధానంగా ఉంటాయి.

12. వివాహం తర్వాత స్త్రీలు గోత్రం మారతారా?

లేదు. గోత్రం Y-క్రోమోసోమ్ ద్వారా వస్తుంది – అంటే పురుషుల ద్వారా.
స్త్రీలు తమ తండ్రి గోత్రాన్నే శ్రాద్ధాదుల్లో ఉంచుతారు.

అందుకే, స్త్రీ గోత్రం మారదు – అది ఆమెలో శాశ్వతంగా ఉంటుంది.

13. దేవతలు కూడా గోత్ర నియమాలను అనుసరించారు

రాముడి వివాహం సమయంలో:
– రాముడు: ఇక్ష్వాకు వంశం, వశిష్ఠ గోత్రం
– సీత: జనకుని కూతురు, కశ్యప గోత్రం

ఇంత పవిత్రమైనది గోత్ర వ్యవస్థ.

14. గోత్రం మరియు ప్రారబ్ధ కర్మ

కొంతమంది పిల్లలు చిన్ననాటి నుంచే ప్రత్యేకమైన అలవాట్లు కలిగి ఉంటారు.
ఇది వారి ప్రారబ్ధ కర్మ మరియు గోత్రం వల్ల.

ఋషులు తమకు ప్రత్యేకమైన కర్మ బీజాలు కలిగి ఉన్నారు – మీలోనూ అలాంటి ప్రభావాలు ఉంటాయి.

15. ప్రతి గోత్రానికి ప్రత్యేక మంత్రాలు, దైవాలు ఉంటాయి.

మీ గోత్రానికి సరిపోయే మంత్రాన్ని ఉపయోగించకపోతే, ఫలితం తక్కువగా ఉంటుంది.

సరైన మంత్రం + మీ గోత్ర శక్తి = 10x శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవం.

16. గోత్రం = గందరగోళంలో ఉన్నపుడు ఆత్మదీపం

మీరు దారి తప్పినట్టు అనిపిస్తే, మీ గోత్రం ఋషిపై ధ్యానం చేయండి.
ఆ ఋషి ఏ ఆలోచనల్లో జీవించాడో, అదే శక్తి మీలో ఉంది.

17. గొప్ప రాజులు గోత్రాన్ని గౌరవించేవారు

చంద్రగుప్త మౌర్యుడు నుండి శివాజీ మహారాజ్ వరకు 

రాజకార్యాలలో కూడా గోత్ర జ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు.

గోత్రం లేని పాలన అంటే – రీడులేని శరీరం లాంటిది.

18. గోత్ర వ్యవస్థ = స్త్రీ రక్షణ విధానం

పురాతన కాలంలో – గోత్రం ఆధారంగా స్త్రీలను వారి వంశానికి తిరిగి గుర్తించగలిగేవారు.

దీన్ని మూఢనమ్మకం అనడం కాదు – ఇది ఒక జ్ఞాన శాస్త్రం.

19. ప్రతి గోత్రం = విశ్వంలో ప్రత్యేక పాత్ర

🍁🌾ఋషులు తమ తమ విధులను నిర్వర్తించేవారు:

– 🍁ఆరోగ్యాన్ని రక్షించడం
–🍁 నక్షత్రాలను పరిశీలించడం
– 🍁ధర్మాన్ని స్థాపించడం
– 🍁న్యాయాన్ని నిర్మించడం

మీ గోత్రం ఈ పాత్రలలో ఒకదానిని కలిగి ఉంటుంది.

20.🚩🌾 ఇది మతం కాదు – ఇది మీ అసలైన గుర్తింపు

🍁🌾మీరు మతసంబంధమైనవారు కాకపోయినా, ఆధ్యాత్మికతను అనుసరించకపోయినా –
గోత్రం మీ ఆత్మ సంబంధిత గుర్తింపు.
మీరు నమ్మాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోవాలి.

😊చివరి మాటలు:
మీ పేరు ఆధునికం కావచ్చు.
మీ జీవితం గ్లోబల్ కావచ్చు.
కానీ మీ గోత్రం – శాశ్వతం.

🚩మీరు దీన్ని పట్టించుకోకపోతే – మీకు సొంతంగా మీరు ఎవరో తెలియని నదిలా అవుతారు.

🚩గోత్రం అనేది మీ గతం కాదు.
అది భవిష్యత్తులో జ్ఞానాన్ని తెరవే పాస్‌వర్డ్..
.
🚩🌾బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర: సనాతన ధర్మం యొక్క నాలుగు దిక్కులు, ఒకే తేజస్సు
(సమగ్రమైన వ్యాసం - ఐక్యత యొక్క శక్తిని చాటేది, భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలిపేది)

🚩🌾"ధర్మం యొక్క సారాంశం సమ్మేళనం, విచ్ఛేదనం కాదు."

🚩🌾వేల సంవత్సరాల ప్రస్థానం కలిగిన సనాతన ధర్మం కేవలం జీవన విధానాన్ని నేర్పడమే కాకుండా, ఆత్మలను అనుసంధానించే అద్భుతమైన మార్గాన్ని చూపింది. వర్ణ వ్యవస్థ యొక్క అంతరార్థాన్ని లోతుగా పరిశీలిస్తే - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కేవలం కులాలు కావు, అది సమాజంలోని విభిన్న కర్తవ్యాల యొక్క సుందరమైన అమరిక. ఇది పుట్టుకతో వచ్చినది కాదు, కర్మలతో, స్వభావంతో ముడిపడిన వ్యవస్థ.

 🚩🌾నలుగురు వర్ణాలు - ఒకే దేహంలోని భిన్న భాగాలు

🚩🌾ఈ నాలుగు వర్ణాలను మన పురాణాలు ఒకే విరాట్ పురుషుని (సమస్త సృష్టికి అధిపతి) శరీరంలోని విభిన్న భాగాలతో పోల్చాయి.

 🚩🌾బ్రాహ్మణుడు:~ విరాట్ పురుషుని ముఖం వంటివాడు - జ్ఞానాన్ని ప్రసరించే మెదడు, వివేకంతో మార్గనిర్దేశం చేసేవాడు. సమాజానికి విద్యాదానం చేసేవారు, ధర్మశాస్త్రాలు బోధించేవారు.

 🚩🌾క్షత్రియుడు:~ విరాట్ పురుషుని భుజాల వంటివాడు - ధర్మాన్ని రక్షించేవి, నీతిని కాపాడే ధీరులు. వీరు సమాజాన్ని దుష్టశక్తుల నుండి రక్షిస్తారు, న్యాయాన్ని పరిపాలిస్తారు.

 🚩🌾వైశ్యుడు:~ విరాట్ పురుషుని ఉదరం వంటివాడు - సమృద్ధిని పెంపొందించేది, వ్యాపారంతో అభివృద్ధిని చేకూర్చేవారు. వీరు సంపదను సృష్టించి, సమాజ శ్రేయస్సు కోసం పంపిణీ చేస్తారు.

 🚩🌾శూద్రుడు:~ విరాట్ పురుషుని పాదాల వంటివాడు - సేవతో అందరినీ నిలిపేవి, 

🚩🌾శ్రమతో సమాజానికి ఆధారమిచ్చేది. వీరు సమాజానికి అవసరమైన సేవలను అందిస్తూ, అందరికీ అండగా నిలుస్తారు.
తల లేకుండా శరీరం నిలువగలదా? భుజాలు లేకుండా శక్తి ఉంటుందా? ఉదరం నిండకుండా జీవం ఉంటుందా? పాదాలు లేకుండా గమ్యం చేరుకోగలమా? లేదు కదా! అదే విధంగా, సనాతన ధర్మంలోని ఈ వర్ణ వ్యవస్థ పరస్పర సహకారం మరియు అవసరాల యొక్క గొప్ప సమన్వయాన్ని తెలుపుతుంది, అంతేకానీ ఇది శ్రేష్ఠతను చూపించే విభజన కాదు. ప్రతి వర్ణం సమాజానికి అత్యవసరం.
🤔విద్వేష బీజాలు ఎక్కడ నుండి వచ్చాయి?

🚩🌾నేడు సనాతన ధర్మాన్ని వేరు చేసేదిగా చిత్రీకరించేవారు, దాని యొక్క లోతైన అర్థాన్ని గ్రహించలేకపోయారు లేదా స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు తమను అంబేద్కర్ అనుచరులుగా చెప్పుకుంటూ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు, మరికొందరు మత దురభిమానాన్ని పెంచి పోషిస్తున్నారు. వీరందరూ కలిసి సనాతన ధర్మాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

🚩🌾భీమ్‌రావ్ అంబేద్కర్ స్వయంగా రామాయణాన్ని అధ్యయనం చేశారని, భగవద్గీత యొక్క సారాంశాన్ని గ్రహించారని, అందుకే ఆయన ఇస్లాం లేదా క్రైస్తవాన్ని కాకుండా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని వారు ఎప్పటికీ చెప్పరు. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడారు, కానీ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకోలేదు.
 ఐక్యతే సనాతన ధర్మం యొక్క జీవనాడి

🚩🌾✊సనాతన ధర్మం ఎల్లప్పుడూ ఐక్యత, ప్రేమ, మరియు సమానత్వాన్ని బోధించింది. మన ఇతిహాసాలు, పురాణాలు దీనికి ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు.

 🚩🌾శ్రీరాముడు ఒక శూద్ర మహిళ అయిన శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించాడు - ఇది కేవలం పండ్లు తినడం కాదు, అది కుల భేదాలను తుడిచిపెట్టే ప్రేమ బంధం. భక్తికి, ప్రేమకు కులం, వర్ణం అడ్డు కాదని నిరూపించాడు.

🌾🚩శ్రీకృష్ణుడు, అప్పటి సమాజంలో తక్కువ కులంగా భావించబడిన విదురుని ఇంట్లో ఆనందంగా భోజనం చేశాడు - "న హి వై శూద్ర రాజానం, నైవ వైశ్యం న శూద్రకం" (మహాభారతం) అని చెప్పి, హృదయం శుద్ధంగా ఉంటే ఏ కులమైనా గొప్పదే అని చాటాడు.

 🚩🌾మహాభారతంలో విదురుడు ధర్మజ్ఞానానికి ప్రతీకగా నిలిచాడు. ఆయన ధృతరాష్ట్రునికి, పాండవులకు ఇచ్చిన ఉపదేశాలు అద్భుతమైనవి. ఇది పుట్టుకతో కాక, జ్ఞానంతోనే గౌరవం వస్తుందని నిరూపిస్తుంది.

 🚩🌾శబరి, గుహుడు వంటి భక్తులను శ్రీరాముడు ఆదరించడం, హనుమంతుడు వంటి వానరుడిని తన అత్యంత ప్రియమైన భక్తునిగా స్వీకరించడం - ఇవన్నీ సనాతన ధర్మంలో మానవత్వం, భక్తి, మరియు సేవలకే ప్రాధాన్యత ఇస్తారని చూపుతాయి.

 🚩🌾ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజ్యంలో బ్రాహ్మణులు, మరాఠాలు, ముస్లింలు మరియు శూద్రులను సమానంగా ఆదరించాడు - సమైక్య పాలనకు ఆదర్శంగా నిలిచాడు. ఆయన సైన్యంలో అన్ని వర్గాల వారికి స్థానం కల్పించారు, వారి సామర్థ్యాలనే పరిగణనలోకి తీసుకున్నారు.

 🚩🌾సంత రవిదాస్ (శూద్రుడు), కబీర్ (ముస్లిం నేత), తులసిదాస్ (బ్రాహ్మణుడు), నామ్‌దేవ్ (తెరజిప్ప) , మీరాబాయి (రాజపుత్ర స్త్రీ) వంటి ఎందరో మహానుభావులు "జాతి పాతి పూచే నహి కోయి" (కులమత భేదాలు అడగరు) అని గొంతెత్తి చాటారు - భక్తి మార్గంలో అందరూ ఒక్కటే అని నిరూపించారు. వారి భక్తి ఉద్యమాలు కులాల సరిహద్దులను చెరిపివేశాయి.

 🚩🌾ఋషి విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడై ఉండి కూడా తన తపస్సు ద్వారా బ్రహ్మజ్ఞానిగా మారాడు. ఇది వర్ణం కర్మను బట్టి మారుతుందని, పుట్టుకను బట్టి కాదని తెలియజేస్తుంది.

 🚩🌾వాల్మీకి మహర్షి, పుట్టుకతో బోయవాడైనప్పటికీ, తన తపస్సు మరియు జ్ఞానంతో బ్రహ్మఋషిగా మారి, రామాయణం వంటి మహాకావ్యాన్ని రచించాడు. ఇది మానవుని అంతర్గత శక్తికి, పరివర్తనకు గొప్ప ఉదాహరణ.
 సనాతన ధర్మం యొక్క మహత్తరమైన సూక్తులు:

🫶🌾"వసుధైవ కుటుంబకం" - ఈ భూమండలం అంతా ఒకే కుటుంబం.
 ఇది కేవలం మాట కాదు, మన జీవన విధానానికి మూలం.

🚩🌾 "ఏకం సత్ విప్రాః బహుధా వదంతి" - సత్యం ఒక్కటే, జ్ఞానులు దానిని వివిధ రకాలుగా వివరిస్తారు. ఇది భగవంతుని ఏకత్వాన్ని, మత సామరస్యాన్ని తెలియజేస్తుంది.

🌹🚩 "సర్వే జన సుఖినో భవంతు" - అందరూ సుఖంగా ఉండాలి. ఈ భావనే సనాతన ధర్మం యొక్క మూల స్తంభం.

 ☘️🌾ముగింపు:~
🌹సనాతన ధర్మంలోని నాలుగు వర్ణాలు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు - ఉన్నత లేదా నీచ భావనలను కలిగించే గోడలు కావు, అవి సమాజం యొక్క అభివృద్ధికి నిర్దేశించిన కర్తవ్యాల యొక్క మెట్లు. 

🌹🌾కాలక్రమేణా వచ్చిన కొన్ని దురాచారాలను సనాతన ధర్మం కాదు, మానవుల స్వార్థం సృష్టించింది. ఈ రోజు మనం ఈ ఐక్యత యొక్క శక్తిని గుర్తించాలి, తప్పుడు ప్రచారం చేసే వారి ఉచ్చు నుండి బయటపడాలి, మరియు గర్వంగా ప్రకటించాలి -

✍️🚩"మేము సనాతనులం, మా ధర్మంలో ప్రతి ఒక్కరికీ స్థానం ఉంది🚩!"

🙌🙏మన పూర్వీకులు అందించిన ఈ జ్ఞాన సంపదను కాపాడుకుంటూ, సమైక్య సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దాం....🤗

మంగళవారం, డిసెంబర్ 09, 2025

జీవం... ఓ అద్భుతమైన ప్రకాశం



జీవం అంటేనే వెలుగు. ప్రకాశం. సృష్టికి మూలం ఈ ప్రకాశమే.

అలాంటి ఓ అద్భుతమై ప్రకాశాన్ని జీవ శాస్త్రవేత్తలు చూడగలిగారు. సృష్టికి మూలమైన ఆ కాంతి పుంజాన్ని చూడడమే కాదు, తొలి సారిగా ఫొటో కూడా తీయగలిగారు.

జీవం ఏర్పడే ఆ క్షణంలో సూక్ష్మంగా విరజిమ్మిన ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు.

ఇది జీవ శాస్త్రంలో చోటు చేసుకున్న ఓ అరుదైన, అద్భతమైన ఆధునిక విజయం.

వీర్యకణం, అండాన్ని చేరుకున్న తరుణంలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా వీక్షించారు.

జీవం ఏర్పడడానికి తొలి దశ అయిన ఆ అపురూప క్షణంలో మెరుపు లాంటి ఓ ప్రకాశం వెల్లివిరుస్తుందని గమనించారు. దీనికి ‘జింక్ స్పార్క్’ అని పేరు పెట్టారు.

వీర్యకణం విజయవంతంగా అండాన్ని చేరే క్షణంలో ఈ ప్రకాశం ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో అండం మిలియన్ల సంఖ్యలో జింక్ అయాన్లను ఒక్కసారిగా విడుదల చేస్తుంది. అది కేవలం క్షణంలో జరిగే మెరుపువంటి ప్రక్రియ. అత్యంత శక్తివంతమైన మైక్రోస్కోపులతో మాత్రమే చూడగలిగేది. మొదట ఈ ఘటనను ఎలుకల అండాలలో గమనించారు. తరువాత అదే ప్రక్రియ మానవ అండాలలో కూడా జరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. దీనితో జీవం మొదలయిందనడానికి చిన్న మెరుపు ఒక సంకేతమని తేలింది.

జీవ సంకేతమైన ఆ వెలుగు, ఆ ప్రకాశం, ఆ మెరుపు, ఆ కాంతి పుంజం... అందంగా, అద్భుతంగా గోచరమైంది. అంతే కాదు, ఫలదీకరణ విజయవంతమైందనడానికి... ఆ వెలుగే ఓ ఆరంభమని సూచించే అరుదైన శాస్త్రీయ ఆవిష్కరణ ఇది.

దాని అందం ఒక్కటే కాదు—ఈ జింక్ స్పార్క్ ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ. ఇది ఫలదీకరణ నిజంగా విజయవంతమైందని ఖచ్చితంగా తెలియజేసే సంకేతం.  భ్రూణ శాస్త్రవేత్తలకు, ఫెర్టిలిటీ నిపుణులకు ఈ ఆధునిక ఆవిష్కరణ... గర్భధారణ ప్రక్రియను మరింతగా అర్థం చేసుకోవడానికి, పరిశీలించడానికి సహాయపడే కొత్త సాధనంగా మారనుంది.

ఒక జీవితం ప్రారంభమయ్యే క్షణాన్ని అక్షరాలా వెలుగులా చూడగలగడం ఎంత విస్మయకరమో ఇదంతా తెలియజేస్తుంది. సూక్ష్మ ప్రపంచంలో జరిగే ఈ మెరుపు, కొత్త జీవం ప్రారంభమయ్యే ఆ నిమిషానికే ప్రకృతి ఇచ్చే ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వేడుకవంటిది. జీవం ఎంత సున్నితమైనదో, ఎంత ఖచ్చితమైనదో, ఎంత అద్భుతమైనదో ఇది గుర్తు చేస్తుంది.

 

గురువాయూర్ మహిమ





 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్‌ ఒకటి. 

🌹ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గురువాయురప్పన్‌గా వెలిసి భక్తజన కల్పవృక్షంగా భాసిస్తున్నాడు. 

🌹ఈ క్షేత్రంలోనే "నారాయణీయం " అన్న స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మానవుడు ఎదుర్కొనే ఆధి "వ్యాధులు"  హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఇది "" మేల్పుత్తూర్‌ నారాయణ భట్టతిరి""  సంస్కృతంలో స్తోత్ర రూపంలో చేసిన అద్భుత రచన. దీని ఆవిర్భావం వెనుక ఆసక్తికర కథ ఒకటి ప్రచారంలో ఉంది.

🌹పదహారేళ్ల ప్రాయానికే వేదాధ్యయనాన్ని, సంస్కృత వ్యాకరణాన్ని ఆపోశన పట్టిన అసమాన ధీశాలి నారాయణ భట్టతిరి. తన గురువైన "అచ్యుతపిషారతి"  క్షయ వ్యాధితో బాధ పడుతుండటం చూసి నారాయణ భట్టతరి ఎంతో కుమిలిపోయాడు. గురుదక్షిణగా ఆ వ్యాధిని భగవత్‌ ప్రార్థనతో తనకు బదిలీ చేసుకుంటాడు. తరువాత గురువాయూర్‌ చేరుకుని తన వ్యాధిని తగ్గించమని వేడుకుంటూ "రోజుకు ఒక దశకం"  చొప్పున స్తుతి చేయడం ప్రారంభించాడు. ప్రతి శ్లోకం చివర తన వ్యాధిని నయం చేయమని భగవంతుడిని వేడుకుంటాడు.

🌹ఈ విధంగా 1036 శ్లోకాలు పూర్తయ్యేసరికి ఆయన వ్యాధి పూర్తిగా తగ్గడంతో పాటు దైవ సాక్షాత్కారం కూడా లభించింది. వేదవ్యాసుడు పద్దెనిమిది వేల శ్లోకాలతో రచించిన భాగవతానికి సంక్షిప్త రూపంగా అసాధారణ ప్రజ్ఞతో నారాయణీయం రచించాడు భట్టతిరి. ఇప్పటికీ గురువాయూర్‌ దేవాలయంలో ఈ పారాయణాన్ని చేయడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నారాయణీయం మొత్తం పారాయణం చేయలేని వారి కోసం ఒక దగ్గరి దారిని చూపారు.

🌹అస్మిన్‌ పరాత్మన్‌ నను పాద్మకల్పే
త్వమిత్థ ముత్థాపిత పద్మయోనిః
అనంత భూమా మమ రోగరాశిం
నిరుంధి వాతాలయవాస విష్ణో

🌹నారాయణీయంలోని ఎనిమిదో దశకంలోని పదమూడవ శ్లోకం ఇది. నిత్యం 108 సార్లు చొప్పున, 48 రోజులు పాటు భక్తి విశ్వాసాలతో ఈ శ్లోకం పారాయణం చేస్తే వైద్యానికి లొంగని మొండి రోగాలు సైతం ఉపశమిస్తాయని ప్రతీతి. పరమాచార్యుల సూచన మేరకు శ్లోకపారాయణం చేసి ప్రయోజనం పొందిన వారెందరో ఉన్నారు...

మన కర్మలకు పద్దెనిమిది మంది సాక్షులు





🍁👉🏾చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ...

🍁👉🏾‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి "" మూగ సాక్షులు""  పద్దెనిమిది ఉన్నాయి. 

🌹👉🏾అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. 

🍁👉🏾ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.

🍁👉🏾దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.

🌹👉🏾అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.

🍁👉🏾నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.