శనివారం, ఆగస్టు 24, 2024

కృష్ణం వందే జగద్గురుం!

ఏం సుఖపడ్డాడని కృష్ణుడు?

పుడుతూనే పరుగు మొదలు...

చెరసాలలో పుట్టి రాత్రికి రాత్రి గడప దాటాడు...

అవడానికి సర్వ శక్తిమంతుడు...

పుట్టగానే తల్లిదండ్రులకు నిజ రూప దర్శనం ఇవ్వగలిగిన వాడు...

నాలుగు చేతులతో విష్ణువుగా కనిపించి మార్గదర్శనం చేయగలిగినవాడు...

ఆ అవతారమూర్తిని తిలకించడానికి దేవతలంతా తరలివచ్చినా వారి సాయం ఆశించలేదు...

వారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు...

గంపలో పసిపిల్లాడిలా పడుకుని, వాన జల్లులో తడుస్తూ, రాత్రికి రాత్రి చలిలో, హోరుగాలిలో, యమున దాటించే ప్రయత్నాన్ని తండ్రి నెత్తిమీదే పెట్టాడు...

ఆది శేషుడు బాధ్యతగా గొడుగు పడితే, యమునా నది వినయంగా దారిస్తే, ఏమీ ఎరగనట్టు కేరింతలు కొడుతూ రేపల్లె చేరుకున్నాడు...

దేవాధిదేవుడై అవతరించి కూడా ఆ అర్థరాత్రి అభద్రతా ప్రయాణం, పాంచభౌతికమైన పరిమితులకు సంకేతమా?

మానవమాత్రులకు తప్పని జీవిత పోరాటానికి మచ్చుగా నిలవాలనే సంకల్పమా?

లేకపోతే... అసాధారణ అలౌకిక లీలా వినోద విన్యాసమా?

ఆ బాల కృష్ణుడికే తెలియాలి!

బొటనవేలు నోట్లో పెట్టుకుని చీక్కుంటూ ఆనందించే పసికూనగా ఉన్నప్పుడే విషపూరితమైన స్తన్యాన్ని అందించిన పూతన చేసిన హత్యాప్రయత్నంతో మొదలైంది జీవన పోరాటం!

పాలతో పాటు ప్రాణాలు కూడా పీల్చేసి వికృత శరీరంతో మహాకాయంగా విరుచుకుపడిపోయిన పూతన గుండెలపై కూర్చుని ఏం జరిగిందో కూడా తెలియనట్టు అమాయమైన ఆటలాడినా, ఎంత గండం గడిచిందో... అనిపించుకున్నాడు!

బండి మీదకొస్తే ఎడమ కాలితో తన్ని ముక్కలు చేశాడు...

సుడిగాలి ఎగరేసుకుపోతే భరించరాని బరువై ఉసురు తీశాడు...

మడుగులో దాగి విషం చిమ్మే పెను పాము పడగలపై ఆనంద తాండవం చేశాడు...

ప్రకృతి విలయం సృష్టిస్తే చిటికెన వేలు మీద కొండనెత్తి ఏడు రాత్రులు మోసి తన వారిని గొడుగై కాపాడుకున్నాడు...

కార్చిచ్చులో గోపబాలురంతా చిక్కుకుని గగ్గోలు పెడితే, ఆ మంటల్ని స్వాహా చేసి రక్షించాడు...

మన్ను తిన్న చిన్న నోటిలో అఖిలాండ కోటి బ్రహ్మాండాలు చూపించి కలయో, వైష్ణవ మాయయో తెలియకుండా చేశాడు...

అల్లరి భరించలేక అమ్మ రోటికి కట్టేస్తే, ఈడ్చుకుంటూ వెళ్లి పెద్ద చెట్లను కూల్చి యక్షుల పాపం పోగొట్టి శాపం తీర్చాడు...

గోవులతో సహా గోపాలురందరినీ గోప్యంగా దాచేసి బ్రహ్మ మాయ చేస్తే, అందరి రూపాలు తానై సృష్టి కర్త చెంపలేసుకునేలా చేశాడు...

ఓ కొంగ, ఓ కొండచిలువ, ఓ ఆవు, ఓ గాడిద... ఇలా ఎన్నో రూపాల్లో రక్కసిమూకలు చంపడానికి చక్కా వస్తే ఆ ప్రమాదాలన్నీ కాసుకుంటూ ఎదిగాడు...

ఊరందరికీ తెలుసు సామాన్య బాలుడు కాదని...

నంద యశోదలకు కూడా తెలుసు తమ వాడు కాదని...

దేవకీ వసుదేవులకూ తెలుసు అవతార పురుషుడని...

కంసుడికీ తెలుసు కడతేర్చేవాడని...

మరి ఏ సుదర్శన చక్రమో పంపించి నేరుగా మామ చెర నుంచి అమ్మానాన్నలను విడిపించలేదేం?

ఆరుగురు తోబుట్టువులను కంస మామ కర్కశత్వానికి బలి చేయకుండా ఆపలేదేం?

రాక్షసులందరినీ ఒకే ఒక కౌమోదకీ దెబ్బతో రాలగొట్టలేదేం?

పద్నాలుగేళ్లు ఎదిగే వరకూ ఎందుకాగాడు?

సరే... పెద్దవాడై కంసపీడ విరగడ చేసి తాతగారని రాజును చూసినా రాజ్యసుఖాలు అనుభవించాడా?

లేదు... విద్య కోసం వినయంగా గురుకులంలో చేరి సేవలు చేశాడు...

ఎప్పుడో చనిపోయిన కుమారుడిని యమ లోకం వెళ్లి మరీ తీసుకొచ్చి గురు దక్షిణ ఇవ్వగలిగిన వాడికి విద్యలొక లెఖ్ఖా?

విద్యార్థిగా నేర్చుకోవడమెలాగో నేర్పించడం కాదూ? 

చదువులన్నీ చిటికెలో నేర్చుకుని గురుకులం నుంచి వచ్చాకైనా కుదుట పడ్డాడా?

కంసుడికి కూతుళ్లనిచ్చిన జరాసంధుడు అల్లుడిని చంపినందుకు కక్ష కట్టి తరలి వస్తే పదహారు యుద్ధాలు చేశాడు...

ఆ యుద్ధాలతో ప్రజల ప్రశాంతత భగ్నమవుతోందని సముద్రమధ్యంలో కోట కట్టి ద్వారకను జలదుర్గంగా మలిపించాడు...

వలచిన వనిత వర్తమానం పంపితే శత్రుకూటంలోకి చొరబడి రుక్మిణీ కళ్యాణంతో లోకకళ్యాణానికి నాంది పలికాడు...

అష్ట భార్యలతో, ఇష్ట సతులతో ఒకొక్కరికి ఒకొక్కడై పదహారు వేల నూట ఎనిమిది మందిగా సంసారంలో పడినా సేద తీరలేదు...

పట్టపురాణి రుక్మిణికి పుట్టిన తొలి సంతానాన్ని పురిట్లోనే రాక్షసుడు ఎత్తుకుపోతే చిద్విలాసంగా భరించాడు...

ధర్మానికి బద్ధులైన అత్త కొడుకులు పంచపాండవులను అడుగడుగునా ఆదుకుంటూనే ఉన్నాడు...

ధర్మరాజు కోరికపై రాయబారిగా మారి శాంతి సందేశానికి వార్తాహారుడయ్యాడు...

అధర్మ జూదంలో పాండవులను అడవుల పాలు చేసిన కౌరవుల్ని యుద్ధరంగానికి రప్పించేదాకా ఊరుకోలేదు...

ధర్మాన్ని గెలిపించడానికి అర్జునుడి రథానికి చోదకుడయ్యాడు...

అవతార లక్ష్యమైన భూభారాన్ని తగ్గించాకయినా పిల్లా పాపలతో సుఖంగా గడిపాడా?

నమ్ముకున్న పాండవుల బాగు కోరి గాంధారి శాపాన్ని నెత్తి మీద వేసుకున్నాడు...

కళ్ల ముందు అయిన వాళ్లు, వారసులు, పుత్రులు, పౌత్రులు నశించిపోతుంటే నిర్వికారంగా తిలకించాడు...

ఎక్కడో అడవిలో ఒంటరిగా వేటగాడి బాణానికి గురై కాలానికి తలొంచాడు...

ఏం? పుడుతూనే ఎన్నెన్నో ఘనకార్యాలు చేసిన వాడు తల్చుకుంటే క్షణాల్లో అన్నీ చక్కబెట్టలేడా?

శకుని పాచికలు పారకుండా చేయలేడా?

యుద్ధం అవసరం లేకుండానే కౌరవ సేనను దునుమాడి ధర్మజుడికి పట్టం కట్టలేడా?

రణరంగంలో బంధుజనాన్నిచూసి మోహంలో పడిన అర్జునుడికి పద్దెనిమిది అధ్యాయాల గీతను బోధించాల్సిన పనేముంది? 

అర్థం చేసుకున్నా... చేసుకోలేకపోయినా... అంతా విష్ణుమాయ!

కష్టం ఎదురైతే కాలు దువ్వి దాని పని పట్టాలని బోధించడానికే... 

ఆ విష్ణుమాయ!

యుద్ధం చేయాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడానికే... 

ఆ విష్ణుమాయ!

మానవాళికి కర్తవ్యం ఉపదేశించడానికే... 

ఆ విష్ణుమాయ!

నీ కర్మలే నిన్ను నడిపిస్తాయని తెలియజేయానికే... 

ఆ విష్ణుమాయ!

దేవుడే స్వయంగా రథం నడుపుతున్నా విల్లు ఎక్కుపెట్టి శరసంధానం చేయకతప్పదని చాటడానికే... 

ఆ విష్ణుమాయ!

ఆ విష్ణుమాయ తొలగిపోవాలంటే... 

ఒకే ఒక మంత్రం నిత్య స్మరణం శరణ్యం...

అదే... కృష్ణం వందే జగద్గురుం!









బుధవారం, ఆగస్టు 21, 2024

ఓ జీవితం... ఓ పుస్తకం... ఓ సినిమా!



'ఇన్నాళ్లూ ఎందుకు చూడలేకపోయాను?'... అనిపించింది  సినిమా చూశాక!

చూశాక దాని గురించి నా అభిప్రాయం రాయాలని కూడా అనిపించింది...

ఇప్పటికే చాలా మంది చూసుంటారు... మాట్లాడుకుని ఉంటారు... రాసి కూడా ఉంటారు...

అయినా నేను కూడా చెప్పాల్సిందే... చెప్పి తీరాల్సిందే!

 సినిమా... ''ట్వెల్త్ఫెయిల్‌''!

దేశంలోనే అతి కఠినమైన ఐఏఎస్‌, ఐపీఎస్పరీక్షల్లో విజేతల జీవితాల్లోకి తొంగి చూస్తే, ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఉంటాయి.  అతి సామాన్యమైన కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్లు, పేదరికం నుంచి ఎదిగిన వాళ్లు, ఎన్నో కష్టాలు పడి అనుకున్నది సాధించిన వాళ్లూ ఎంతో మంది కనిపిస్తారు. ఒకొక్కరిదీ ఒకో కథ! అందరూ హీరోలే!

'ట్వెల్త్ఫెయిల్‌' కథ కూడా ఇదే. అయితే ఇది కేవలం కథ కాదు... నిజ జీవితం ఆధారంగా తీసినది.

 జీవితం మనోజ్కుమార్శర్మది. అత్యంత పేదరికంలోంచి వచ్చి ఐపీఎస్అధికారిగా ఎదిగిన వ్యక్తిది. 2005 బ్యాచ్కి చెందిన ఇతడి గురించి 2019లో 'ట్వెల్త్ఫెయిల్‌' పేరుతో హిందీ రచయిత అనురాగ్పాథక్ నవల రాశాడు.  నవలను ఆధారం చేసుకుని తీసిందే  సినిమా. 2023 అక్టోబరులో విడుదలైంది. నవలకీ, సినిమాకి మూలమైన మనోజ్కుమార్శర్మ ప్రస్తుతం మహారాష్ట్ర క్యాడర్లో సెంట్రల్ఇండస్ట్రియల్సెక్యూరిటీ ఫోర్స్ఇనస్పెక్టర్ జనరల్ఆఫ్పోలీస్గా పని చేస్తున్నారు.

మధ్యప్రదేశ్లో బందిపోట్లకు పేరొందిన చంబల్ప్రాంతానికి చెందిన ఇతడు, ట్వెల్త్ క్లాస్ఫెయిల్అయి, బీఏ అయిందనిపించుకున్న  సామాన్య నిరుపేద యువకుడు.  డిగ్రీతో దొరికిన ఏదో ఉద్యోగంలో  గుమాస్తాగానో ఇమిడిపోయి ఉంటే, ఇతడి గురించి చెప్పుకోవలసిన పనే లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలో తెలియాలంటే అతడి ట్వెల్త్క్లాస్రోజుల్లోకి వెళ్లి చూడాలి.

పరీక్షకి సిద్ధం అవ్వాలంటే, జేబుల నిండా స్లిప్పులు పెట్టుకుని వెళ్లాలనుకునే స్థాయి అతడిది. గ్వాలియర్కాలేజీలో ప్రిన్సిపాల్సాయంతో పరీక్ష రాసే ట్వెల్త్క్లాస్స్టూడెంట్లందరిదీ అదే స్థాయి. స్వయంగా ప్రిన్సిపాల్ బోర్డు మీద జవాబులు రాస్తుంటే, వాటిని మక్కికి మక్కీగా ఎక్కించేస్తూ కుర్రాళ్లంతా పరీక్ష రాసే సమయంలో ఫ్లయింగ్స్క్వాడ్రూపంలో నిజాయితీ గల  డీఎస్పీ వచ్చాడక్కడికి. ప్రిన్సిపాల్బెదిరింపులకి గానీ, లంచానికి గానీ అతడు లొంగలేదు. ఫలితంగా  ఏడాది  కాలేజీలో మొత్తం స్టూడెంట్లందరూ ''ట్వెల్త్ఫెయిల్‌'' అయ్యారు.  బ్యాచ్లోని వాడే మనోజ్కుమార్శర్మ.

ఫ్రెండ్సంతా  డీఎస్పీని తిట్టుకుంటే, అతడికి మాత్రం ఆయనలోని నిజాయితీ నచ్చింది.  నిజాయితీ ఇచ్చిన ధైర్యం నచ్చింది.

అప్పుడొక కల కన్నాడతడు. అది నిద్రలో వచ్చే కల కాదు. మెలకువగా ఉన్నప్పుడు తరిమే కల!

''ఎలాగైనా డీఎస్సీ అవ్వాలి!''... అదీ  కల!!

అతడి స్థాయికి అది ఎవరెస్ట్శిఖరం అంత పెద్దది. అయినా ఎక్కాలనే అనుకున్నాడు.

''నేను మీలా  నిజాయితీ పరుడైన పోలీసు అధికారి అవ్వాలంటే ఏంచేయాలి?'' అని  డీఎస్పీనే అడిగాడు.

''ముందు నిజాయితీగా ఉండు...'' అన్నాడాయన.  మాటలు అతడి మనసులో నాటుకున్నాయి.

అప్పటికి అతడికి ఐపీఎస్అంటే ఏంటో కూడా తెలియదు.

మళ్లీసారి పరీక్షల సమయానికి గ్వాలియర్కాలేజీ కుర్రాళ్ళంతా దర్జాగా స్లిప్పులు పెట్టి ఫస్ట్క్లాస్తెచ్చుకుంటే... వాటి కేసి చూడనైనా చూడకుండా నిజాయితీగా తనకొచ్చిందేదో రాసి సాధారణంగా ప్యాస్అవడం అతడి తొలి విజయం.

కాపీ కొట్టి ఫస్ట్ క్లాస్తెచ్చుకోవడం కంటే, నిజాయితీగా వచ్చిన థర్డ్క్లాసే అతడికి ఆనందాన్ని ఇచ్చింది.

 తర్వాత డీఎస్పీ అవ్వాలన్న కలే అతడిని నడిపించింది.  చేతిలో పైసా లేకపోయినా  స్నేహితుడి సాయంతో దిల్లీ తీసుకెళ్లింది. పగలంతా 15 గంటలు పని చేస్తూ, రాత్రి వేళ 6 గంటలు చదువుకునేలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు మూడు సార్లు ప్రిలిమ్స్ఫెయిలయినా పట్టువదలకుండా నిలబెట్టింది. చివరి ప్రయత్నంలో మెయిన్స్క్లియర్చేయించింది!

ఇదంతా చెప్పినంత సులువు కాదు... అనుభవించినంత కష్టం!

ఇంటికి దూరంగా... ఊరుకాని ఊర్లో... దిల్లీ మహానగరంలో... కడుపు నిండడానికి కూడా పని చేయక తప్పని పరిస్థితిలో... ఐపీఎస్కి సిద్ధం కావాలంటే... ఏం చేయాలో అన్నీ చేశాడతడు!

బత్రూంలు క్లీన్చేశాడు!

పిండిమరలో పని చేశాడు!

మూడడుగుల స్థలంలోనే రాత్రిళ్లు గుడ్డి బల్బు వెలుగులో చదువుకున్నాడు!

ఎన్నో వెటకారాలు ఎదుర్కొన్నాడు!

అవమానాలు భరించాడు!

ఇంత కష్టపడుతున్నా... ఎక్కడా చిరునవ్వును చెరగనీయలేదు. పట్టుదల సడలనీయలేదు. నిజాయితీని వదులుకోలేదు.

కానీ...  నిజాయితీకే పెద్ద గండం ఎదురైంది మెయిన్స్ఇంటర్య్యూలో!

''ట్వెల్త్ఎందుకు ఫెయిలయ్యావు?'' అనే ప్రశ్నే  గండం!

ముందుగానే  ప్రశ్నను ఊహించిన చాలా మంది అతడికి చెప్పారు... అబద్దం ఆడమని. ఎవరో చనిపోయారని చెప్పమన్నారు.

మనోజ్కుమార్నాలుగేళ్ల కష్టం  ప్రశ్న ముందు నిలబడింది!

అబద్దం ఆడి ఇంటర్వ్యూ గెలవాలా?

నిజం చెప్పి ఓడిపోవాలా?

ఓడిపోయినా పరవాలేదు కానీ నిజమే చెప్పాలనుకున్నాడు నిజాయితీగా.

'' ఏడాది ఛీటింగ్జరగలేదు. అందుకే ఫెయిల్అయ్యాను...'' అన్నాడు ధైర్యంగా.

ఇంటర్వ్యూ గదిలో బాంబు పేల్చిందా జవాబు. బోర్డు సభ్యులే నివ్వెరపోయారు  జవాబుకి!

ఏమనాలో తెలియక, '' రెండు నిమిషాలు బయట వేచి ఉండు'' అన్నారు.

తిరిగి పిలిచాక అడిగారు... ''ఎందుకలా చెప్పావు? అబద్దం ఆడి ఉండవచ్చుగా?'' అని నేరుగా అడిగారు.

''అబద్దం చెప్పి ఐపీఎస్ఆఫీసర్ని అవడం కంటే... నిజం చెప్పి ఇంటర్వ్యూలో ఫెయిల్అవడమే నయమనుకున్నాను...'' అన్నాడతను చిరునవ్వుతో ధైర్యంగా, నిజాయితీగా.

 తర్వాత ప్రశ్నలకు... అతడు  ఛీటింగ్వ్యవహారం గురించి చెప్పాడు.  ఛీటింగ్వెనకాల ఉండే స్థానిక నాయకుల ప్రాబల్యం గురించి చెప్పాడు. సమాజంలో అధికారం చేసే ఆగడాల గురించి చెప్పాడు.  నిజాయితీ పరుడి చేతిలో అదే అధికారం ఉంటే వ్యవస్థలో మార్పు వస్తుందనే అతడి నమ్మకం గురించి చెప్పాడు.

అప్పుడు దూసుకొచ్చింది ఆఖరి ప్రశ్న, ఇంటర్వ్యూ ఛీఫ్మెంబర్నుంచి...

'' ఇంటర్వ్యూలో ఫెయిలైతే ఏం చేస్తావ్‌?''.

నిజాయితీనే నమ్ముకున్న అతడు స్థిరంగా చెప్పాడు...

''సూర్యుడినై వెలుగు పంచాలనుకున్నాను. ఓడిపోయినా పరవాలేదు. ఇంటికెళ్లిపోయి  దీపాన్నై మా వీధికి వెలుగునిస్తా.  టీచరునై చిన్నపిల్లలకి నిజాయితీని పరిచయం చేసి భావి తరాన్ని తయారు చేస్తా...''

 ఛీఫ్మెంబర్ఊరుకోలేదు...

''ఓకే... యూకెన్గో అండ్బికమ్ స్ట్రీట్ల్యాంప్‌...'' అన్నాడు వెటకారంగా.

అతడు గదిలోంచి బయటకి వచ్చేస్తుంటే... ''వేస్ట్ఆఫ్టైమ్‌...'' అనే  బోర్డు మెంబర్కామెంట్వినిపించింది.

 కామెంట్విన్నాక... అతడికి అర్థం అయింది. ఇన్నాళ్ల తన ప్రయత్నమంతా వృధా!

ఇదేనా నిజాయితీకి దక్కిన ఫలితం? అనుకున్నాడు దిగులుగా.

కానీ... అతడు నమ్మిన నిజాయితీ అతడిని ఓడిపోనివ్వలేదు....

ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లలో చర్చ జరిగింది.

''ఇతడిని సెలెక్ట్చేయకపోతే  ఇంటర్వ్యూలన్నీ వేస్ట్‌...'' అన్నారు మెజర్టీ సభ్యులు!

అలా నిజాయితీ గెలిచింది!  నిరుపేద పల్లెటూరి కుర్రాడిని ఐపీఎస్అధికారిగా యూనిఫాం వేసి కుర్చీలో కూర్చోబెట్టింది!!

................

ఇదంతా... కేవలం 2005 బ్యాచ్లో దేశం మొత్తం మీద 121 ర్యాంకుతో సివిల్స్విజేతగా నిలిచిన మనోజ్కుమార్శర్మ కథ కాదు. ఏటా సివిల్స్కి సిద్ధమయ్యే లక్షలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే యదార్థం. నిజం చెప్పాలంటే... ఒక్క సివిల్స్విద్యార్థులకే కాదు. ప్రతీ విద్యార్థికీ స్ఫూర్తి దాయకమే. ఇంకా చెప్పాలంటే... ప్రతి ఒక్కరికీ కూడా. ఎందుకంటే,  విద్యార్థి అయినా,  ఉద్యోగి అయినా... ఎవరైనా ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు.  పోరాటంలో ఓడిపోతూ ఉంటారు. అలా ఓడిపోయిన ప్రతీసారీ తిరిగి తేరుకుని ఎలా పోరాడాలో చెప్పే కథ ఇది. ఓటమిని ఒప్పుకోకుండా మళ్లీ ప్రయత్నించి ఎలా గెలవాలో చెప్పే కథ ఇది. అందుకే  కథ హిందీ రచయిత అనురాగ్పాఠక్ని ఆకర్షించింది. ఆయన రాసిన రెండో నవలే 'ట్వెల్త్ ఫెయిల్‌'. ఆయన మొదటి పుస్తకం 'వాట్సాప్పార్క్రాంతి' అనే కథల సంపుటి.  కథలన్నీ సోషల్మీడియా ప్రభావం మీద రాసినవి.  పరీక్షలంటే భయపడే విద్యార్థులందరికీ సాయపడాలనే ఉద్దేశంతో మనోజ్కుమార్జీవితాన్ని 'ట్వెల్త్ఫెయిల్‌' నవలగా రాశారీయన.  పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

 నవల బాలీవుడ్దర్శక నిర్మాత విధు వినోద్చోప్రా దృష్టిలో పడింది. ఆయన సామాన్యుడా? 'మున్నాభాయ్‌', 'త్రీ ఇడియట్స్‌', 'పీకే', 'సంజు' లాంటి మంచి చిత్రాలను అందించిన నిర్మాత. 'పరిందా', '1942- లవ్స్టోరీ', 'మిషన్కాశ్మీర్‌' లాంటి సినిమాలతో అలరించిన దర్శకుడు. జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిలింఫేర్అవార్డులు అందుకున్న ప్రతిభాశాలి. అలాంటి అతడి చేతిలో పడిన 'ట్వెల్త్ఫెయిల్‌' నవల,  మరపురాని చిత్రంగా తెరకెక్కింది. రూ. 20 కోట్ల బడ్జెట్తో తీస్తే దాదాపు రూ. 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కాసుల కంటే అధికంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

మనోజ్కుమార్శర్మ పాత్రలో నటుడు విక్రాంత్మాసీ చాలా చక్కగా కుదిరాడు. టీవీ, సినిమాల నటుడిగా ఫిలింఫేర్అవార్డులు అందుకున్న ఇతడు మనోజ్పాత్రలో ఒదిగిపోడానికి ఎంతో కష్టపడ్డాడు. మనోజ్కుమార్ఐపీఎస్కోసం దిల్లీలో చదువుకునే సమయంలో అతడికి పరిచయమై,  తర్వాత అతడి జీవిత భాగస్వామిగా మారిన శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్అద్భుతంగా నటించింది. అంతక్రితం 'బీచమ్హౌస్‌', 'షాదిస్తాన్‌' 'దిల్బేకరార్‌' చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకి, శ్రద్ధా జోషి పాత్ర పెద్ద బ్రేక్గా మారింది. అయిదు ఫిలింఫేర్అవార్డులను అందుకున్న 'ట్వల్త్ఫెయిల్‌' సినిమా, తొలి ఫ్రేమ్నుంచి చివరి వరకు ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వదు.

ప్రేక్షకులు మనోజ్కుమార్తో కలిసి ప్రయాణిస్తారు. అతడి కష్టాలు చూసి నిట్టూరుస్తారు. అతడి పట్టుదల చూసి ఆశ్చర్యపోతారు. అతడి పరిస్థితికి కన్నీరుమున్నీరవుతారు.  అతడి అవమానాలకు బాధ పడిపోతారు. ఆఖరికి అతడు గెలిస్తే, తామే గెలిచినంతగా కేరింతలు కొడతారు. అలా అడుగడుగునా ప్రేక్షకులు మమేకమయిపోయేంత గొప్పగా వినోద్చోప్రా సినిమాను మలిచాడు. సినిమాలో చాలా మంది నిజ జీవిత పాత్రలనే పోషించారు. యూపీఎస్సీ కోచ్వికాస్దివ్యకీర్తి అదే పాత్రలో నటించాడు. సివిల్స్కి సిద్ధమవుతున్న విద్యార్థులే వేర్వేరు పాత్రల్లో కనిపించారు. ఇది సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది.

ఇంతకు మించి  సినిమా గురించి చెప్పడం కన్నా, చూడ్డమే మంచింది.  సినిమాను చూడకపోతే ఏదో మిస్సయ్యేవాళ్లమనే సంగతి...  సినిమాను చూసిన వాళ్లందరికీ అర్థం అవుతుంది. మొత్తం మీద అందరూ 'వితౌట్ఫెయిల్‌' తప్పకుండా చూడాల్సిన సినిమా 'ట్వెల్త్ఫెయిల్‌''.

+  సినిమాలో నటులను ఎంపిక చేసుకోడానికి పెద్ద ప్రక్రియే జరిగింది. ముఖ్యమైన ఒకో  పాత్రకి 35 మంది కంటే ఎక్కువ మందిని పరీక్షించి మరీ ఎంపిక చేశారు. కానీ మనోజ్కుమార్పాత్రకి మాత్రం విక్రాంత్ని ఒక్కరినే పరీక్షించి వెంటనే తీసుకున్నారు.

+ పల్లెటూరి కుర్రాడిగా కనిపించడం కోసం విక్రాంత్ సినిమాలో ఎలాంటి మేకప్వేసుకోలేదు. పైగా సహజత్వం కోసం పల్లెటూర్లో ఎండలో గంటల తరబడి గడిపి, చర్మం రంగును ఛామనఛాయగా మార్చుకున్నాడు.  ప్రయత్నంలో అతడి చర్మం కొన్ని చోట్ల బాగా కమిలిపోయింది కూడా. ఇది కొన్ని సీన్లలో స్పష్టంగా కనిపిస్తుంది.

+ మూడేళ్ల కాలంలో  సినిమా స్క్రీన్ప్లేను వినోద్చోప్రా 200 సార్లకు పైగా మార్చి రాసుకున్నాడు.

+ సినిమాలో ట్రూత్అండ్డేర్ఆట సన్నివేశంలో నటి  మేధా శంకర్‌  తనే స్వయంగా లైవ్షూటింగ్లో పాట పాడింది.

+ యూపీఎస్సీ ఇంటర్వ్యూ సన్నివేశాన్ని  భవనంలో చిత్రీకరించడానికి అనుమతించకపోవడంతో అచ్చం అలాగే సెట్ ని వేశారు. సినిమా చూసిన యూపీఎస్సీ ఉద్యోగులు అది సెట్అని గ్రహించలేనంత సహజంగా దాన్ని సృష్టించారు.

+ సినిమాలో చూపించిన గ్రామం సెట్టింగును నిజానికి ముంబై దగ్గర్లో ఎక్కడైనా వేయవచ్చు. కానీ వినోద్చోప్రా అందుకు ఒప్పుకోకుండా చంబల్నది దగ్గర సహజమైన  గ్రామాన్నే ఎంచుకున్నాడు. రోజూ షూటింగ్సిబ్బంది అందరూ మూడు గంటలు ప్రయాణించి  గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది.

+ బాక్సాఫీస్ప్రకారం, 18 ఏళ్ల తర్వాత 25 వారాలు ఆడిన సినిమాగా ఇది నిలిచింది