క్రమశిక్షణకు
ప్రాణమిచ్చే దర్శకుల్లో కె.వి. రెడ్డి ఒకరు. ‘మాయాబజార్’ లాంటి గొప్ప సినిమాను
తెలుగు చలన చిత్రసీమకు అందించిన ఆయన ముందు అలనాటి ఏఎన్నార్, ఎన్టీఆర్ కూడా చేతులు
కట్టుకుని ఉండేవాళ్లు. సెట్టింగులోకి వచ్చారంటే ఒక పూజ చేస్తున్నంత శ్రద్ధగా పని
చేసేవారాయన. పని మొదలు పెట్టాక ఎలాంటి అనవసరపు శబ్దాలు
ఆయనకు వినబడకూడదు. అంతా నిశ్శబ్దంగా సాగిపోవాలి. ఈ విషయంలో నిర్మాతలను సైతం ఆయన
లెక్క చేసేవారు కారు. ఓసారి ‘మాయా బజార్’ షూటింగులో అదే జరిగింది. సెట్ లో కేవీ
రెడ్డి స్క్రిప్ట్ చూసుకుంటూ పాత్ర దారుల చేత రిహార్సల్స్ చేయిస్తున్నారు . ఓ మూలగా
నిర్మాతలైన నాగి రెడ్డి , చక్రపాణి ఉన్నారు. వాళ్లు ఎవరి గురించో మాట్లాడుకున్తున్నారు. కేవీ రెడ్డి
అది గమనించి వారి కేసి ఓసారి సీరియస్ గా చూశారు. అయినా వాళ్లది గమనించలేదు. వాళ్లు
మాట్లాడుకోవడం ఆపకపోవడంతో కేవీరెడ్డి ఎలాంటి మొహమాటం లేకుండా గొంతు పెంచి, "ఉడ్ యూ ప్లీజ్ అవుట్ ..." అన్నారు. సెట్ లో వాళ్లంతా
ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. వెంటనే నాగిరెడ్డి , చక్రపాణి లేచి నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోయారట.
ఇంకో సందర్భంలో సెట్ బయట ఏఎన్నార్, ఎన్టీఆర్, గుమ్మడి, నాగి రెడ్డి, చక్రపాణి కూర్చుని ఉన్నారు. ఏయన్నార్ ఏదో జోక్ వేయగానే అందరూ గొల్లుమని నవ్వారు. వెంటనే లోపల నుంచి కేవీ రెడ్డి అరుపు వివిపించింద. అంతే... అందరూ సైలెంట్. ఇలాంటి క్రమశిక్షణను ఈనాటి చిత్ర సీమలో ఊహించగలమా?

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి